Webdunia - Bharat's app for daily news and videos

Install App

కఠిన శిక్షలతోనే యాసిడ్ దాడులకు అడ్డుకట్ట..!

Webdunia
శుక్రవారం, 27 ఫిబ్రవరి 2015 (16:52 IST)
దేశంలో నానాటికి పెరిగిపోతున్న యాసిడ్ దాడుల అడ్డుకట్టకు పార్టీలకతీతంగా రాజకీయ నాయకులంతా ఏకమైయ్యారు. ఈ దాడులకు పాల్పడేవారికి మరింత కఠినమైన శిక్షలు విధించడం ద్వారా వీటిని అదుపుచేయొచ్చని నేతలు అభిప్రాయం వెలిబుచ్చారు. రాజ్యసభలో శుక్రవారం జీరో అవర్ సమయంలో జేడీయూకు చెందిన కేసీ త్యాగి ఈ విషయాన్ని లేవనెత్తారు. 
 
యాసిడ్ దాడులకు గురైన మహిళలు శారీరకంగా, మానసికంగా బాధపడుతూ జీవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీటిని నాన్ బెయిలబుల్ కేసులుగా సుప్రీంకోర్టు చెప్పినా నేరాలు అదుపులోకి రావడం లేదన్నారు. యాసిడ్ దాడులకు గురైన బాధితులు తమకు న్యాయం చేయండంటూ రోడ్లమీదకు వచ్చి ధర్నాలకు దిగడం అత్యంత బాధాకరమన్నారు. 
 
మహిళలే ఎక్కువగా యాసిడ్ దాడుల బారిన పడుతున్నారని, వారికి రూ.10 లక్షల నుంచి 15 లక్షల నష్టపరిహారం ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. అంతటితో ఆగక ఆ కేసులను త్వరితగతిన పూర్తి చేసే విధంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటుచేయాలన్నారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments