Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.50 కోట్లిస్తే ప్రధాని మోడీ చంపేస్తా : మాజీ సైనికుడు

Webdunia
మంగళవారం, 7 మే 2019 (13:43 IST)
తనకు ఎవరైనా రూ.50 కోట్లు ఇస్తే ప్రధాని నరేంద్ర మోడీని చంపేస్తానని భారత ఆర్మీకి చెందిన మాజీ సైనికుడు తేజ్ బహదూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే అంశంపై ఆయన తాజాగా ఓ వీడియో రిలీజ్ చేశాడు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, సార్వత్రిక ఎన్నికల్లో వారణాసి లోక్‌సభ స్థానం నుంచి ప్రధాని నరేంద్ర మోడీ పోటీ చేస్తున్నారు. ఆయనపై పలువురు పోటీ చేస్తున్నారు. దీంతో తేజ్‌ బహుదూర్ కూడా నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలను అసంపూర్తిగా నింపారని పేర్కొంటూ ఆయన నామినేషన్‌ను తోసిపుచ్చారు. 
 
ఈ నేపథ్యంలో ప్రధానిని హత్య చేస్తానంటూ బహదూర్‌ వ్యాఖ్యానించిన వీడియో బయటకు రావడంతో వైరల్‌గా మారింది. ఈ వీడియో రెండేళ్ల కిందటిదని సమాచారం. ఈ వీడియోలో ఉన్నది తానేనని తేజ్‌ బహదూర్‌ ఒప్పుకున్నారు. అయితే, ఈ వీడియో వెనుక కుట్ర ఉందని ఆయన ఆరోపించారు.
 
మరోవైపు ఈ వీడియోపై బీజేపీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ప్రధాని మోడీ హత్యకు మరోసారి కుట్ర జరగడం.. అది కూడా ఆయనపై పోటీకి నామినేషన్‌ వేసిన అభ్యర్థే కుట్ర పన్నడం దిగ్భ్రాంతికి గురిచేసిందని బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్‌ నరసింహరావు తెలిపారు. మోడీని ఎదుర్కోలేక ప్రతిపక్ష పార్టీలు ఇలాంటి హింసా మార్గాలను ఎంచుకుంటున్నాయని ఆరోపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mahesh Babu: కుబేర చిత్రానికి మహేష్ బాబు విషెష్ - ఓవర్ బడ్జెట్ తిరిగి వస్తుందా?

Mega157: మెగాస్టార్ చిరంజీవి, నయనతారపై ముస్సోరీ షెడ్యూల్ పూర్తి

హర్యాన్వీ గుర్తింపు, ఇష్క్ బావ్లాను ఆవిష్కరించిన కోక్ స్టూడియో భారత్

పాపా చిత్ర విజయంతో స్ట్రెయిట్ సినిమా ప్లాన్ చేయబోతున్నాం: నిర్మాత నీరజ కోట

విష్ణు మంచు కన్నప్ప నుంచి అవ్రామ్ మంచు మేకింగ్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments