Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు : రైతు బిడ్డను పెళ్లి చేసుకుంటే రూ.2 లక్షలు

Webdunia
మంగళవారం, 11 ఏప్రియల్ 2023 (17:57 IST)
కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీకావడంతో బరిలో ఉన్న రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకర్షించేందుకు వివిధ రకాలైన హామీలను గుప్పిస్తున్నాయి. ఇందులోభాగంగా, రైతులను ఆకట్టుకొనేందుకు జేడీ(ఎస్‌) పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి ఓ వినూత్న హామీ ఇచ్చారు. రైతుల కుమారులను వివాహం చేసుకొనే మహిళలకు రూ.2 లక్షలు ఇస్తామని ప్రకటించారు. కోలార్‌లో జరిగిన పంచరత్న ర్యాలీలో ఆయన ఈ మేరకు ప్రకటించారు. 
 
ఆ ర్యాలీలో కుమార స్వామి మాట్లాడుతూ రైతు బిడ్డలతో పెళ్లిళ్లను ప్రోత్సహించేందుకు యువతులకు ప్రభుత్వం రూ.2 లక్షలు నజరాన ప్రకటించాల్సిన అవసరం ఉందన్నారు. రైతుల కుమారులను పెళ్లి చేసుకోవడానికి యువతులు సిద్ధంగా లేరంటూ తనకు వినతిపత్రం అందిందన్నారు. 'రైతుల కుమారుల పెళ్లిళ్లను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం యువతులకు రూ.2 లక్షలు ఇవ్వాలి. మా కుర్రాళ్ల ఆత్మాభిమానాన్ని కాపాడేందుకు ఈ పథకాన్ని మేము ప్రవేశపెట్టనున్నాం' అని కుమారస్వామి హామీ ఇచ్చారు. 
 
కర్ణాటకలో ఎన్నికల కమిషన్‌ నిర్దేశించిన షెడ్యూల్‌ ప్రకారం మే 10వ తేదీన ఒకే విడతలో రాష్ట్రం మొత్తం పోలింగ్‌ జరగనుంది. ఈ ఎన్నికల ఫలితాలను మే 13వ తేదీన ప్రకటించనున్నారు. జేడీఎస్‌ ఇప్పటికే 93 మంది అభ్యర్థులను ప్రకటించింది. మరో వైపు అధికార భాజపా నుంచి జాబితా వెలువడలేదు. నాలుగు రోజులుగా ఢిల్లీలోని భాజపా జాతీయ కార్యాలయంలో ఇందుకోసం కసరత్తు సాగుతోంది. మరోవైపు కాంగ్రెస్‌ రెండు జాబితాలను ఇప్పటికే విడుదల చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

మరో నెలలో ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్ - గెలాక్టస్‌తో యుద్ధానికి సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

దివ్యాంగ విద్యార్ధుల కోసం నాట్స్ ఉచిత బస్సు, విశాఖలో బస్సును లాంఛనంగా ప్రారంభించిన ఎంపీ భరత్

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments