Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్ర సదన్‌లో రోటీ రచ్చ.. ఇరకాటంలో మోడీ సర్కారు!

Webdunia
గురువారం, 24 జులై 2014 (09:47 IST)
ఢిల్లీలోని న్యూ మహారాష్ట్ర సదన్‌లో తమకు సంప్రదాయ వంటలు వడ్డించలేదన్న నెపంతో 11 మంది శివసేన ఎంపీలు ఒక ముస్లిం వ్యక్తికి రోటీ తినిపించి రంజాన్ ఉపవాస దీక్షను భగ్నం చేసిన అంశం పార్లమెంటులో దుమారం రేపింది. మత స్వేచ్ఛను శివసేన ఎంపీలు కాలరాశారని విపక్ష సభ్యులు విరుచుకుపడ్డారు. శివసేన ఎంపీలపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. 
 
దీంతో సభలో గందరగోళం చెలరేగింది. ఈ రోటీ వివాదం ఓ పెను వివాదంలా మారింది. పార్లమెంటు ఉభయ సభలను ఓ కుదుపు కుదిపింది. బీజేపీ అగ్రనేత ఎల్కే. అద్వానీ సైతం రోటీ వివాదంపై విచారం వ్యక్తం చేశారు. అలా జరిగి వుండాల్సింది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. దీంతో ప్రధాని నరేంద్ర మోడీ సర్కారు ఇరకాటంలో పడినట్టయింది. 
 
దీంతో తేరుకున్న కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖామంత్రి వెంకయ్య నాయుడు సభలో వివరణ ఇచ్చారు. రోటీ వ్యవహారాన్ని వివాదం చేయరాదని, ముఖ్యంగా... మత రంగు అంటించరాదని విపక్ష పార్టీలను కోరారు. 

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

Show comments