Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేలిరకం జే-34 పత్తితో యాకూబ్‌కు ఉరితాడు.. తాడు మెత్తగా ఉండేందుకు?

Webdunia
గురువారం, 30 జులై 2015 (13:37 IST)
ముంబై పేలుళ్ల కేసీలు ఉరిశిక్షకు గురైన యాకూబ్ మెమన్‌కు బీహార్‌లో తయారు చేసిన ఉరితాడును వినియోగించారు. ఈ ఉరితాడును నాగ్‌పూర్ జైలులో అధికారులు యాకూబ్ ఉరితాడు గురించి చెబుతూ.. బీహార్‌లోని బుక్సార్ కేంద్ర కారాగారంలో తయారు చేసినట్లు తెలిపారు. తమ జైలులో తయారైన ఉరితాడును నాగపూర్‌కు పంపించినట్లు బుక్సాల్ జైలు సూపరింటెండెంట్ ఎస్.కే. చౌదరి తెలిపారు. 
 
మేలిరకం జే-34 పత్తిని వాడి దీన్ని తయారు చేశామని, ఆ తరువాత తాడు మెత్తగా ఉండేందుకు మైనం, అరటి గుజ్జు తదితరాలను వాడామని ఆయన తెలిపారు. తాడులో ఎక్కడా ముడులు ఉండకుండా జాగ్రత్త పడ్డామని వివరించారు.
 
14 సంవత్సరాల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన ధనుంజయ్ బెనర్జీని ఉరితీసేందుకు కోల్ కతా జైలు అధికారుల కోరిక మేరకు అప్పట్లో ఇదే తరహా ఉరితాడును పంపామని, ఆపై అఫ్జల్ గురు, అజ్మల్ కసబ్‌లను ఉరితీసేందుకు వినియోగించిన తాళ్లను కూడా ఇక్కడి ఖైదీల చేతనే తయారు చేయించామని ఆయన వివరించారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments