Webdunia - Bharat's app for daily news and videos

Install App

మమతా పెరుగుతున్న మద్దతు.. ఇండియా కూటమి పగ్గాలు అప్పగించాలి.. : లాలూ

ఠాగూర్
బుధవారం, 11 డిశెంబరు 2024 (10:38 IST)
వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి ఇండియా కూటమి నేతల మద్దతు క్రమంగా పెరుగుతుంది. ఈ జాబితాలో ఆర్జీడీ అధ్యక్షుడు, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ కూడా చేరిపోయారు. ఇండియా కూటమి నాయకత్వ బాధ్యతలను మమతా బెనర్జీకి అప్పగించాలని ఆయన అభిప్రాయపడ్డారు. 
 
ర్జేడీ అధినేత, మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్, మహారాష్ట్రకు చెందిన మాజీ సీఎం ఉద్ధవ్ బాల్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన పార్టీలు మమత నాయకత్వానికి దన్నుగా నిలిచాయి. మంగళవారం లాలూ ప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ.. ఇండియా కూటమి బాధ్యతలను మమతకు అప్పగించాలని, ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ అభ్యంతరాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. 
 
లాలూ కుమారుడు, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. శివసేన (యూబీటీ) రాజ్యసభ ఎంపీ ప్రియాంకా చతుర్వేది కూడా మమతకు మద్దతు తెలి పారు. "ఇండియా కూటమికి మమత నాయకత్వం ఆత్యంత ముఖ్యం" అని వ్యాఖ్యానించారు. పశ్చిమ బెంగాల్‌ను బలోపేతం చేసినట్టే.. ఆమెకు పగ్గాలు అప్పగిస్తే కూటమిని కూడా బలోపేతం చేస్తారన్న నమ్మకం ఉందన్నారు. 
 
శివసేన (యూబీటీ) కీలక నేత సంజయ్ రౌత్ మాత్రం భిన్నంగా స్పందించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నాయకత్వాన్ని ఎవరూ ప్రశ్నించలేరన్నారు. ఇదిలావుంటే, ఇండియా కూటమిలో సఖ్యత లేదని, పొంతనలేని వ్యాఖ్యలు చేస్తున్నారని బీజేపీ విమర్శలు గుప్పించింది. కాగా, మిత్రపక్షాల వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ స్పందించారు. కూటమి పార్టీల్లోని ద్వితీయ శ్రేణి నాయకులు చేస్తున్న వ్యాఖ్యలపై స్పందించవద్దని ఆయన కాంగ్రెస్ ఎంపీలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments