Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముఖానికి మాస్క్.. హాస్టల్‌లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి

Webdunia
సోమవారం, 14 జనవరి 2019 (14:09 IST)
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయంలో ఓ పరిశోధక విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ముఖానికి మాస్క్ ధరించి, హాస్టల్ గదిలోని ఫ్యానుకు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఈ యూనివర్శిటీలో మైక్రోబయాలజీ విభాగంలో పరిశోధక విద్యార్థిగా సుకన్య పొడార్ (26) అనే యువతి చదువుతోంది. ఈమె ముఖానికి నల్ల మాస్క్ ధరించి హాస్టల్ గదిలోని ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు హాస్టల్ గది తాళాలు పగులగొట్టి ఆమెను ఆస్పత్రికి తరలించారు. 
 
అయితే, సుకన్య అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ పరిశోధక విద్యార్థిని ముఖానికి నల్ల మాస్క్ ధరించి ఉండటంపై పోలీసులు పలు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. పైగా, సుకన్య... పరిశోధన చేస్తూనే ఓ కాలేజీలో పార్ట్‌టైమ్ టీచర్‌గా పని చేస్తోంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆత్మహత్యా? హత్యా? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments