Rats Bite: ఇండోర్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఎలుకలు.. ఇద్దరు శిశువుల మృతి.. ఎలా? (video)

సెల్వి
గురువారం, 4 సెప్టెంబరు 2025 (17:08 IST)
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఘోరం జరిగింది. ఎలుకలు పసిప్రాణాలను బలిగొన్నాయి. ఇండోర్‌లో ఉన్న పెద్ద ప్రభుత్వ ఆసుపత్రి మహారాజా యశ్వంత్ రావ్ హాస్పిటల్‌లో ఈ ఘోరం జరిగింది. కేవలం రెండు రోజుల వ్యవధిలో రెండు నెలల శిశువు, ఒక నవజాత శిశువు ఎలుకల దాడిలో ప్రాణాలు కోల్పోయారు. 
 
సెప్టెంబర్ 1వ తేదీ రెండు నెలల శిశువుని  పీడియాట్రిక్ సర్జరీ వార్డులో చేర్చారు. ఆ శిశువు వెన్నుముక సంబంధిత సమస్యతో బాధపడుతోంది. రాత్రి సమయంలో డ్యూటీలో ఉన్న సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా, ఎలుకలు శిశువు చేతి వేళ్లను కొరికాయి. వెంటనే ఈ విషయాన్ని గుర్తించిన తల్లిదండ్రులు ఆసుపత్రి సిబ్బందికి ఫిర్యాదు చేశారు. 
 
అయితే, అప్పటికే శిశువు పరిస్థితి విషమించడంతో మరుసటి రోజు మృతి చెందింది. ఈ ఘటన జరిగిన మరుసటి రోజే, సెప్టెంబర్ 2న, అదే ఆసుపత్రిలోని నవజాత శిశువుల వార్డులో మరో దారుణం చోటుచేసుకుంది. 
 
పుట్టిన కొన్ని గంటలకే ఆరోగ్యం క్షీణించడంతో ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఉంచిన ఓ పసికందుని ఎలుకలు కరిచి చంపేశాయి. ఈ ఘటనలపై ఆందోళన చెంది, కన్నీటి పర్యంతమైన తల్లిదండ్రులు నిరసనలకు దిగారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Drishyam 3: దృశ్యం 3 వంటి కథలు ముగియవు - పనోరమా స్టూడియోస్, పెన్ స్టూడియోస్‌

SS thaman: ఎస్ థమన్ ట్వీట్.. తెలుగు సినిమాలో మిస్టీరియస్ న్యూ ఫేస్ ఎవరు?

పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి అదిరిపోయే అప్‌డేట్

హోటల్ గదిలో ఆత్మను చూశాను... : హీరోయిన్ కృతిశెట్టి

ఫ్యాన్స్‌కు మెగా ఫీస్ట్ - ఎంఎస్‌జీ నుంచి 'శశిరేఖ' లిరికల్ సాంగ్ రిలీజ్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments