Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముగిసిన రతన్ టాటా అంత్యక్రియలు.. కంటతడి పెట్టించే దృశ్యం (Video)

ఠాగూర్
గురువారం, 10 అక్టోబరు 2024 (18:10 IST)
భారతదేశ వ్యాపార, పారిశ్రామిక ముఖచిత్రాన్ని మార్చేసిన ప్రముఖుల్లో ఇండియా ఇండస్ట్రియల్ ఐకాన్ రతన్ టాటా ఒకరు. ఆయన అనారోగ్యంతో బుధవారం రాత్రి కన్నుమూశారు. ఆయన మృతితో యావత్ దేశం విచారంలో మునిగిపోయింది. ఆయన అంత్యక్రియలు గురువారం సాయంత్రం దేశ వాణిజ్య రాజధాని ముంబైలోని వర్లీ శ్మశానవాటికలో మహారాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛలనాతో ముగిశాయి. మహారాష్ట్ర పోలీసులు తుపాకులతో గౌరవ వందనం సమర్పించారు. 
 
పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా అంత్యక్రియలకు కేంద్ర ప్రభుత్వం తరపున కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. ఏపీ ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేశ్ హాజరయ్యారు. అలాగే, భారీ సంఖ్యలో రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు రతన్ టాటాకు చివరిసారి నివాళులు అర్పించారు. ముంబైలోని ఎన్సీపీఏ నుంచి వర్మి శ్మశానవాటిక వరకు జరిగిన అంతిమయాత్రలో ముంబై నగర వాసులు, టాటా గ్రూపు కంపెనీల ఉద్యోగులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. 
 
ఇదిలావుంటే, రతన్ టాటా పెంపుడు శునకం శవపేటిక వద్దకు చేరుకుని అక్కడే ఉండిపోయింది. రతన్ టాటా భౌతికకాయం వద్ద దీనంగా విలపిస్తూ ఉండిపోయింది. ఈ దృశ్యాన్ని చూసిన ప్రతి ఒక్కరూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.  

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments