Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేప్ కేసు విత్‌డ్రా చేసుకోలేదనీ కాల్చిపారేశారు... ఎక్కడ?

Webdunia
శనివారం, 19 జనవరి 2019 (12:53 IST)
తనపై పెట్టిన రేప్ కేసును ఉపసంహరించుకోలేదని అత్యాచార బాధితురాలిని ఓ నిందితుడు కాల్చిచంపాడు. ఈ దారుణం గుర్గావ్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఓ గుర్గావ్‌కు చెందిన ఓ మహిళ పోషణ నిమిత్తం ఓ నైట్ క్లబ్‌లో డ్యాన్సర్‌గా పని చేస్తోంది. ఇదే క్లబ్‌లో సందీప్ కుమార్ అనే వ్యక్తి బౌన్సర్‌గా పని చేస్తున్నాడు. 
 
ఆ మహిళా డ్యాన్సర్‌పై కన్నేసిన సందీప్.. గత 2017 మార్చి నెలలో అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై బాధిత మహిళ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు నిందితుడుని అరెస్టు చేశారు. ఈ కేసు విచారణలో ఉండగా, నిందితుడు బెయిల్‌పై విడుదలయ్యాడు. 
 
ఈ క్రమంలో స్టేట్‌మెంట్‌ రికార్డు నిమిత్తం మహిళ శుక్రవారం కోర్టుకు వచ్చి ఇంటికి వెళ్లింది. ఆ తర్వాత కొన్ని గంటల్లో ఇంటికి వెళ్లిన సందీప్.. ఆమెను బలవంతంగా ఎత్తుకెళ్లి కేసును ఉపసంహరించుకోవాల్సిందిగా బలవంతం చేశాడు. దీనికి ఆమె ససేమిరా అనడంతో తుపాకీతో కాల్పులు జరిపాడు. దీంతో ఆమెను అక్కడే ప్రాణాలు కోల్పోయింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments