Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళా రోగికి నేలపైనే భోజనం... మానవత్వమా... ఏది నీ చిరునామా...?

ఇటీవలి కాలంలో మానవత్వాన్ని మంటగలిపే సంఘటనలు కనిపిస్తున్నాయి. ఆమధ్య కన్నకొడుకు తీవ్ర అనారోగ్యంతో ఉంటే ఆసుపత్రిలో చేర్చుకునేందుకు నిరాకరించడంతో పాటు కనీసం అంబులెన్స్ సౌకర్యాన్ని కూడా కల్పించకపోవడంతో ఓ బ

Webdunia
శనివారం, 24 సెప్టెంబరు 2016 (17:42 IST)
ఇటీవలి కాలంలో మానవత్వాన్ని మంటగలిపే సంఘటనలు కనిపిస్తున్నాయి. ఆమధ్య కన్నకొడుకు తీవ్ర అనారోగ్యంతో ఉంటే ఆసుపత్రిలో చేర్చుకునేందుకు నిరాకరించడంతో పాటు కనీసం అంబులెన్స్ సౌకర్యాన్ని కూడా కల్పించకపోవడంతో ఓ బాలుడు మరణించాడు. ఇలాంటి ఘటనలు వరుసగా దేశంలో ఆయా ఆసుపత్రుల్లో చోటుచేసుకుంటున్నాయి. తాజాగా జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో మరో దారుణం జరిగింది. వివరాల్లోకి వెళితే... ఓ రోగికి కుడిచేయి విరగడంతో ఆమె ఆసుపత్రిలో చేరింది. 
 
భోజనం వేళ ఆమె అన్నం కోసం వెళితే పళ్లెం ఇవ్వలేదు. సొంత పళ్లెం తెచ్చుకోవాలని చెప్పారు. ఐతే తనకు పళ్లెం లేదని చెప్పడంతో... అయితే తిను అంటూ నేలపైనే భోజనం పెట్టేశారు. ఆకలితో అలమటిస్తున్న ఆ మహిళ కూరలన్నీ కలుపుకుని నేలపైనే కలుపుకుని భోజనం చేసింది. ఈ ఘటన తాలూకు ఫోటోను ఓ జాతీయ దినపత్రిక ప్రచురించడంతో ఈ ఘటనకు కారణమైన సిబ్బందిపై అధికారులు వేటువేశారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments