Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడీ - రాజ్‌నాథ్‌ల ప్రచ్ఛన్న యుద్ధం... అందుకే రాజీవ్ మెహ్రిషీ నియామకం!

Webdunia
బుధవారం, 2 సెప్టెంబరు 2015 (10:56 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతుందా? అందుకే హోంశాఖ కార్యదర్శిగా రాజీవ్ మెహ్రిషీని రాజ్‌నాథ్‌కు మాటమాత్రం చెప్పకుండా మోడీ నియమించినట్టు వార్తలు వస్తున్నాయి. రాజస్థాన్‌లో వసుంధరా రాజే ప్రభుత్వంలో చీఫ్ సెక్రటరీగా పనిచేస్తున్న రాజీవ్, సంస్కరణల అమలులో ముందు నిలిచి మోడీ కోటరీలోకి చేరిపోయారు. 
 
1978 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఈయనను గత సంవత్సరం అక్టోబరులో ఆర్థిక వ్యవహారాల విభాగానికి మోడీ తీసుకొచ్చారు. అరుణ్ జైట్లీకి కుడి భుజంగా నిలిపారు. ఆ శాఖలో సైతం రాజీవ్ తీసుకున్న నిర్ణయాలు దేశ ఆర్థిక వృద్ధికి ఎంతగానో ఉపయోగపడ్డాయి. దీంతో హోం శాఖలోకి, అందునా రాజ్‌నాథ్‌కు ఇష్టం లేకుండానే రాజీవ్ ప్రవేశించడం, మంత్రిత్వ శాఖలో అస్థిరతకు దారితీయవచ్చని కొందరు అధికారులు వ్యాఖ్యానించారు. 
 
నిజానికి తనకు నమ్మకమైన వ్యక్తిని హోంశాఖ కార్యదర్శిగా నియమించుకోవాలని రాజ్‌నాథ్ గట్టిగా భావించారు. అయితే, చివరకు తనకు తెలియకుండానే కార్యదర్శిగా రాజీవ్‌ నియామకం జరిగిపోవడాన్ని ఆయన జీర్ణించుకోలేక పోతున్నారు. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments