Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజీవ్ హత్యకేసులో నిందితులకు ఊరట.. ఉరిశిక్షను రద్దుచేసిన సుప్రీం కోర్టు...

Webdunia
బుధవారం, 29 జులై 2015 (14:46 IST)
భారత దేశ దివంగత ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ హత్యకేసులో నిందితులకు ఊరట లభించింది. ఈ కేసులో నిందితులైన మురుగేశన్, సంతానం, పేరరివాళన్‌లకు విధించిన ఉరిశిక్షను  సుప్రీం కోర్టు రద్దుచేసింది. ఈ శిక్షను జీవిత ఖైదుగా మారుస్తూ సంచలనాత్మక తీర్పునిచ్చింది. 1991 మే 21న శ్రీపెరంబదూర్‌లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ మానవబాంబు పేలి దుర్మరణం చెందారు.
 
ఆ సమయంలో రాజీవ్‌తో పాటు పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఈ హత్య కేసులో తనను తాను పేల్చుకున్న మానవబాంబు ధను సంఘటనా స్థలంలోనే చనిపోగా, ప్రధాన నేరస్తులైన శివరాసన్, మరో ఇద్దరు పోలీసు ఎన్ కౌంటర్‌లో చనిపోయారు. ఈ హత్య కేసులో నిందితులైన మురుగేశన్, సంతానం, పేరరివాళన్‌లు 24 సంవత్సరాలుగా జైలులో ఉంటున్నారు. 
 
వారు ముగ్గురికి గతంలో కింది కోర్టు విధించిన ఉరిశిక్షను పైకోర్టు ఖరారు చేస్తూ తీర్పునిచ్చింది. అయితే 25 ఏళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న వారిని ఇప్పుడు ఉరి తీయడం భావ్యం కాదని, వారు ప్రధాన నిందితులు కానందువల్ల ఉరిశిక్షను రద్దుచేయాలని సుప్రీంకోర్టుకు తమిళనాడు ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. అయితే మాజీ ప్రధాని హంతకులను ఎట్టిపరిస్థితిలోనూ కనికరించరాదని కోరుతూ కేంద్ర ప్రభుత్వం క్యురేటివ్ పిటిషన్ దాఖలుచేసింది. ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీం కోర్టు బుధవారం కొట్టివేసింది.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments