Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరో 'ఎన్టీఆర్' కావాలని... సైకిల్ గుర్తుపై కన్నేసిన 'బాషా'

Webdunia
శుక్రవారం, 11 డిశెంబరు 2020 (16:05 IST)
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లో రావడం ఖాయమైపోయింది. తన కొత్త పార్టీ ఏర్పాటుపై ఈ నెలాఖరులో ఆయన ప్రకటన చేయనున్నారు. ఆ తర్వాత జనవరి నెలలో ఈ పార్టీని ప్రారంభిస్తారు. పార్టీ ప్రారంభించిన తర్వాత రాష్ట్ర శాసనసభ ఎన్నికలను ఎదుర్కొనేందుకు ఆయన కేవలం ఐదు నెలల సమయం మాత్రమే ఉంటుంది. 
 
అయినప్పటికీ ఆయన ఎన్నికల కోసం ఆయన సైకిల్ గుర్తును ఎంచుకోవాలని భావిస్తున్నారు. ఎందుకంటే, గతంలో తెలుగు ప్రజల ఆరాధ్యదైవం, సినీ నటుడు ఎన్.టి.రామారావు కూడా అసెంబ్లీ ఎన్నికలకు ముందు అంటే కేవలం 8 నెలల సమయం ఉండగా తెలుగుదేశం పార్టీని స్థాపించి, అతితక్కువ కాలంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఆయన ఎంచుకున్న గుర్తు సైకిల్.  
 
ఇపుడు రజనీకాంత్ కూడా సైకిల్ గుర్తునే ఎంచుకోనున్నట్టు సమాచారం. ఇప్పటికే రజనీకాంత్ రాజకీయ సలహాదారులు కూడా భారత ఎన్నికల సంఘంలో సైకిల్ గుర్తును రిజిస్టర్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. కాగా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రాంతీయ పార్టీ అయిన సమాజ్‌వాదీ పార్టీ కూడా ఇదే ఎన్నికల గుర్తును ఎంచుకున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments