Webdunia - Bharat's app for daily news and videos

Install App

పడక సుఖానికి అడ్డుగా ఉందనీ.. ప్రియుడితో కలిసి నాలుగేళ్ళ కుమార్తె హత్య...

Webdunia
సోమవారం, 17 మే 2021 (18:26 IST)
పడక సుఖానికి అడ్డుగా ఉందనీ భావించిన ఓ తల్లి.. తన ప్రియుడితో కలిసి నాలుగేళ్ళ కుమార్తెను మట్టుబెట్టింది. ఈ దారుణ హత్య రాజస్థాన్ రాష్ట్రంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తన భార్య టీనా (25), నాలుగేళ్ల కుమార్తె నందిని కనిపించడం లేదంటూ గతేడాది డిసెంబరు 16న కోటా జిల్లాలోని బోర్ఖెరా గ్రామానికి చెందిన సుమిత్ యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 
 
కేసు నమోదు చేసుకుని టీనా కోసం గాలిస్తున్న పోలీసులు ఎట్టకేలకు టీనా ఆచూకీ లభ్యమైంది. జైపూర్ జిల్లాలోని ఉడావాలా గ్రామంలో ఆమె ఉన్నట్టు ఈ నెల 13న పోలీసులు గుర్తించారు. అక్కడికెళ్లి చూసిన పోలీసులు ఆశ్చర్యపోయారు. అక్కడామె తన ప్రియుడు ప్రహ్లాద్ సహాయ్ (45)తో కలిసి జీవిస్తోంది.
 
టీనాను అదుపులోకి తీసుకున్న పోలీసులు నందిని గురించి ప్రశ్నించారు. కుమార్తె తన తల్లిదండ్రుల వద్ద ఉందని చెప్పి పోలీసులను బురిడీ కొట్టించే ప్రయత్నం చేసింది. పోలీసులు నిలదీయడంతో ఆ తర్వాత నిజాన్ని అంగీకరించింది. 
 
తన ప్రియుడు ప్రహ్లాద్‌తో కలిపి నందినిని చంపేసి అల్వార్‌లోని సరిస్కా అడవిలో పడేసినట్టు చెప్పింది. నందిని తన ప్రియుడితో కలిసి శాలువాతో గొంతు బిగించి చంపేసినట్టు చెప్పారు. ఈ కేసులో నిందితులిద్దరినీ అరెస్టు చేసిన పోలీసులు తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments