Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎవడు భరిస్తాడండీ బాబూ.. భర్తను మంచానికి కట్టేసి కరెంట్ షాకిచ్చింది..!?

Webdunia
బుధవారం, 18 ఆగస్టు 2021 (17:31 IST)
current shock
భర్త హింసలు పెడితే భరించే భార్యలు కనుమరుగవుతున్నారు. ప్రస్తుతం సీన్ మారింది. భర్త పెట్టే హింసలు తట్టులేక పోతున్న మహిళలు వారికి బుద్ది చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా చిత్రహింసలు పెడుతున్న భర్తకు కరెంట్ షాక్ పెట్టిన సంఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌ బికనీర్‌కు చెందిన మహెంద్రన్ అనే వ్యక్తి తన భార్యతో తరచు ఘర్షణ దిగుతుండడం, అనుమానాలు పెట్టుకోవడంతోపాటు దుర్భాషాలడడడం వంటివి ఆయన భార్య తట్టుకోలేక పోయింది. ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి ఇంటికి వచ్చిన భర్తకు బుద్ది చెప్పేందుకు ప్లాన్ వేసింది. ఇంటికి వచ్చిన భర్తతో స్వీట్‌గా మాట్లాడి మత్తు మందు కలిపిన భోజనం పెట్టింది. అనంతరం నిద్రలోకి జారుకున్నాక కాళ్లను మంచానికి కట్టేసింది. అనంతరం రెండు కాళ్లకు కరెంటు షాక్ పెట్టింది.
 
దీంతో మెలకువ వచ్చి, అరిచినా కూడా భర్తను వదిలిపెట్టలేదు..అలా రెండు రోజుల పాటు కరెంట్ షాక్ పెట్టి చిత్రహింసలకు గురి చేసింది...అనంతరం రెండు కాళ్లు కాలిపోయిన తర్వాత ఆమె కోపం చల్లారింది.. ఆ తర్వాత భర్త సోదరునికి ఫోన్ చేసి మహేంద్రన్‌‌కు కరెంట్ షాక్ తగిలిందని కూల్‌గా చెప్పింది. 
 
దీంతో కుటుంభ సభ్యులు వచ్చి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే మహేంద్రన్ ఆసుపత్రి నుండి సృహలోకి వచ్చిన తర్వాత అసలు విషయం కుటుంబ సభ్యులకు చెప్పాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments