Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెట్లు నరకడాన్ని అడ్డుకున్నదనీ పెట్రోల్ పోసి నిప్పంటించారు.. ఎక్కడ?

భూతాపాన్ని తగ్గించేందుకు ఇంటికో మొక్కను నాటాలని ప్రభుత్వాలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. కానీ, కొందరు గ్రామస్థులు తమతమ ప్రాంతాల్లో ఉన్న చెట్లను నిలువునా నరికివేస్తున్నారు. పైగా చెట్ల నరకివేతను అడ్

Webdunia
సోమవారం, 27 మార్చి 2017 (14:26 IST)
భూతాపాన్ని తగ్గించేందుకు ఇంటికో మొక్కను నాటాలని ప్రభుత్వాలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. కానీ, కొందరు గ్రామస్థులు తమతమ ప్రాంతాల్లో ఉన్న చెట్లను నిలువునా నరికివేస్తున్నారు. పైగా చెట్ల నరకివేతను అడ్డుకున్నా లేక ప్రశ్నించినా వారిపై భౌతిక దాడులకు దిగుతున్నారు. తాజాగా ఓ మహిళ చెట్ల నరికివేతను అడ్డుకోవడంతో ఆగ్రహించిన గ్రామస్థులంతా కలిసి ఆమెను సజీవదహనం చేశారు. 
 
ఈ దారుణం రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... జోధ్‌పూర్‌లోని ఓ గ్రామంలో ఆదివారం రోడ్డు నిర్మాణ పనులు చేస్తుండగా.. లలిత అనే మహిళకు చెందిన పొలంలో చెట్లు అడ్డుగా వచ్చాయి. వాటిని తొలగిస్తామని చెప్పగా.. లలిత అందుకు నిరాకరించింది. చెట్ల నరికివేతకు లలిత ఒప్పుకోకపోవడంతో ఆగ్రహానికి గురైన గ్రామస్థులు ఆమెపై దాడి చేశారు. 
 
అంతటితో ఆగకుండా.. ఆమెపై పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన లలిత.. చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మరణించింది. సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. నిందితుల్లో గ్రామ సర్పంచ్‌ రణ్‌వీర్‌ సింగ్‌‌తో పాటు.. 10 మంది ఉన్నారు. వీరందరిపై కేసు నమోదు చేశారు. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments