Webdunia - Bharat's app for daily news and videos

Install App

అప్పు తీర్చలేదని కేసు.. కలెక్టరేట్‌లో రైతు ఆత్మహత్య

Webdunia
బుధవారం, 22 మే 2019 (14:46 IST)
మరో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పు తీర్చలేక పోవడంతో బ్యాంకు అధికారులు కేసు పెట్టారు. దీంతో అవమానభారంతో కుంగిపోయిన ఆ రైతు చెట్టుకు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ విషాదకర సంఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని హనుమాన్‌గఢ్‌లో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హనుమాన్‌గఢ్‌కు చెందిన సురజరామ్(52) అనే రైతు స్థానికంగా ఉండే ఓ ప్రైవేటు బ్యాంకులో రూ.6.5 లక్షల రుణం తీసుకున్నాడు. ఈ అప్పుతో పంట వేసినప్పటికీ గిట్టుబాటు కాలేదు. మరోవైపు రెండేళ్లలో ఈ అప్పును తీర్చలేకపోవడంతో అసలు, వడ్డీ కలిపి రూ.9 లక్షలకు చేరుకుంది. ఈ అప్పును తిరిగి చెల్లించలేక పోయాడు.
 
దీంతో అప్పు చెల్లించాలని బ్యాంకు అధికారులు పలుమార్లు నోటీసులు పంపించినప్పటికీ రైతు నుంచి స్పందనలేదు. దీంతో బ్యాంకు అధికారులు పోలీస్ స్టేషనులో కేసు పెట్టారు. ఫలితంగా పోలీసులు ఆ రైతును అరెస్టు చేశారు. 
 
ఆ తర్వాత బెయిలుపై విడుదలైన సురజరామ్.. అవమానభారంతో కుంగిపోయి సోమవారం రాత్రి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట చెట్టుకు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. ఈ ఘటన నేపథ్యంలో కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

Pradeep: నటుడిగా గేప్ రావడానికి ప్రధాన కారణం అదే : ప్రదీప్ మాచిరాజు

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments