Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజస్థాన్ ఆలయానికి రూ.9లక్షల రూపాయలకు కొత్తనోట్లు.. విరాళంగా సమర్పించుకున్న భక్తులు

పెద్ద నోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా ప్రజలు నానా ఇబ్బందులు పడుతుంటే.. రాజస్థాన్ రాష్ట్రంలోని ఓ దేవాలయంలోని హుండీలో భక్తులు భారీ విరాళాలు సమర్పించున్నారు. నోట్ల రద్దు వల్ల జనం తమ ఖర్చుల కోసం డబ్బులు విత్

Webdunia
శనివారం, 3 డిశెంబరు 2016 (11:39 IST)
పెద్ద నోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా ప్రజలు నానా ఇబ్బందులు పడుతుంటే.. రాజస్థాన్ రాష్ట్రంలోని ఓ దేవాలయంలోని హుండీలో భక్తులు భారీ విరాళాలు సమర్పించున్నారు. నోట్ల రద్దు వల్ల జనం తమ ఖర్చుల కోసం డబ్బులు విత్ డ్రా చేసేందుకు బ్యాంకులు, ఏటీఎంల ముందు పడిగాపులు పడినా నగదు దొరకని నేపథ్యంలో రూ. 9లక్షల రూపాయల కొత్త రెండువేల రూపాయల నోట్లను రాజస్థాన్.. చిట్టోర్ ఘర్ పట్టణంలోని సాన్ వాలియాజీ దేవాలయంలో హుండీలో విరాళంగా చేరింది.
 
గడచిన 20 రోజుల్లో రూ.9 లక్షల రూపాయల మేర కొత్త రెండువేలరూపాయల నోట్లను భక్తులు విరాళంగా వేయడంతో దేవాలయ అధికారులు షాక్‌కు గురయ్యారు. నగదు కొరత ఉన్న ప్రస్థుత పరిస్థితుల్లోనూ దేవుడికి భక్తులు కొత్తనోట్లను విరాళం అందించడం ద్వారా తమ భక్తిని చాటుకున్నారని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఆలయంలోని హుండీలను తెరచి లెక్కించగా గడచిన రెండు నెలల్లో మొత్తం పాత, కొత్త నోట్లు కలిపి రూ.4.5కోట్ల విరాళాలు వచ్చాయని, ఇందులో 9 లక్షల రూపాయలకు పైగా కొత్త నోట్లు సైతం ఉన్నాయని అధికారులు చెప్పుకొచ్చారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments