Webdunia - Bharat's app for daily news and videos

Install App

వృద్ధురాలిని చంపి మాంసం ఆరగించిన యువకుడు..

Webdunia
ఆదివారం, 28 మే 2023 (16:04 IST)
రాజస్థాన్ రాష్ట్రంలో ఓ దారుణం జరిగింది. వృద్ధురాలిని చంపిన ఓ యువకుడు.. చివరకు ఆమె మాంసాన్నే ఆరగించాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, రాష్ట్రంలోని పాలి జిల్లాలో సారధన గ్రామంలో శుక్రవారం శాంతిదేవి(65) అనే మహిళ పశువులను మేపుతుండగా సురేంద్ర ఠాకూర్‌ అనే వ్యక్తి రాయితో దాడి చేసి హత్య చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడే ప్రాణాలు విడిచింది. ఆ తర్వాత నరరూప రాక్షుడు ఆమె మాంసాన్ని భక్షించాడు. 
 
ఈ దారుణానికి పాల్పడిన యువకుడికి పిచ్చిపట్టినట్టు స్థానికుల సమాచారం. ఈ ఘటన తర్వాత ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించగా, ఆ యువకుడికి హైడ్రోఫోబియా అనే వ్యాధి (కుక్కకాటు వల్ల వచ్చే జబ్బు)తో బాధపడుతున్నట్టు తేల్చారు. గతంలో రేబిస్ వ్యాధి వచ్చివుంటుందని, దానికి వ్యాక్సిన్ తీసుకోకపోవడం వల్లే ఈ వ్యాధి బారినపడివుంటాడని వైద్యులు చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments