Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూజారిని సజీవ దహనం చేశారు.. భూమికోసం పెట్రోల్ పోసి ఘోరంగా..?

Webdunia
శుక్రవారం, 9 అక్టోబరు 2020 (17:07 IST)
పరువు హత్యలు ఒకవైపు, మహిళలపై అఘాయిత్యాలు మరోవైపు.. ఇక కక్షలు వేరొక వైపు.. ఇలా దేశంలో నేరాల సంఖ్య మాత్రం పెరిగిపోతుంది. తాజాగా రాజస్థాన్‌లోని కరౌలీ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. 50 ఏళ్ళ పూజారిని దుండగులు పెట్రోల్ పోసి సజీవ దహనం చేశారు. ఈయనను బాబూలాల్ వైష్ణవ్‌గా గుర్తించారు. 5.2 ఎకరాల భూమికి సంబందించిన వివాదమే ఈ ఘోరానికి కారణమని తెలుస్తోంది. 
 
రాధాకృష్ణ టెంపుల్ ట్రస్టుకు చెందిన ఈ భూమి జిల్లా సమీపంలోని గ్రామంలో ఉంది. అయితే ఈ స్థలాన్ని ప్రభుత్వం పూజారుల మనుగడకు కేటాయించింది. ఇక్కడే తన సొంత ఇంటిని నిర్మించుకోవాలని వైష్ణవ్ నిర్ణయించుకుని అందుకు ప్రయత్నించగా గ్రామంలోని అగ్ర వర్ణ మీనా కులస్థుల కన్ను ఈ భూమిపై పడింది. 
 
వారు అక్రమంగా అక్కడ షెడ్ నిర్మించగా వైష్ణవ్ అభ్యంతరం చెప్పడంతో పంచాయతీ గ్రామ పెద్దలవరకు వెళ్ళింది. అయితే తీర్పు పూజారికి అనుకూలంగా రావడంతో అగ్రవర్ణ కులస్థులు కక్ష గట్టి వైష్ణవ్ ఫై పెట్రోల్ పోసి సజీవదహనం చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments