Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆందోళనకు దిగిన పుల్వామా అమరుల భార్యలు అరెస్టు!

Webdunia
శుక్రవారం, 10 మార్చి 2023 (16:13 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామాలో ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో 40 మంది జవాన్ల కుటుంబాలు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడితో యావత్ దేశం ఉలికిపాటుకు గురైంది. అయితే, ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి మృతుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని పలు ప్రభుత్వాన్ని ఢంకా బజాయిస్తూ ప్రకటనలు గుప్పించాయి. ఈ దాడి ఘటన జరిగి మూడేళ్లు గడిచిపోయింది. 
 
ఈ క్రమంలో తమకు న్యాయం జరగలేదని రాజస్థాన్‌లో అమరుల భార్యలు ఆరోపిస్తూ రోడ్డెక్కారు. పుల్వామా బాంబు పేలుడులో రాజస్థాన్‌కు చెందిన ముగ్గురు జవాన్లు అమరులయ్యారు. వీరిని ఆదుకుంటామని రాజస్థాన్ ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది. కానీ, ఆ తర్వాత ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ క్రమంలో గత నెల 28వ తేదీ నుంచి తమకు న్యాయం చేయాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలెట్ ఇంటి ముందు ధర్నాకు దిగారు. 
 
ఈ విషయం తెలుసుకున్న సచిన్ పైలెట్ అమరవీరుల భార్యలతో స్వయంగా మాట్లాడి, ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అయినప్పటికీ వారు ఏమాత్రం వినిపించుకోలేదు. దీంతో పోలీసులు వారిపట్ల దురుసుగా ప్రవర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ స్పందించింది. పోలీసుల తీరుపై మండిపడింది. వితంతువులపై భౌతిక దాడి జరిగిందని, దీనిపై వివరణ ఇవ్వాలంటూ రాజస్థాన్ డీజీపీకి లేఖ రాసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

డ్రగ్స్ వ్యతిరేక ప్రచారాన్ని బాధ్యతగా తీసుకుంటా - విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments