Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాత్రి భోజనం వడ్డించలేదనీ భార్యను చంపేసిన భర్త.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 24 జులై 2023 (12:06 IST)
కొందరు భార్యాభర్తలు చిన్న చిన్న విషయాలకే గొడవపడుతుంటారు. ఇలాంటి గొడవలు చివరకు ప్రాణాలకే ముప్పు తెచ్చిపెడుతున్నాయి. తాజాగా ఓ భర్త క్షణికావేశంలో తన భార్యను చంపేశాడు. రాత్రి భోజనం వడ్డించలేదన్న కోపంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ దారుణం రాజస్థాన్ రాష్ట్రంలోని జోథ్‌పూర్ జిల్లాలో జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన రమేష్ బేనివాల్ (35), సుమన బేనివాల్ అనే దంపతులు ఉండగా, వీరికి 15యేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. రమేష్ ఒక వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే వృత్తిరీత్యా రమేష్ తరచుగా జోథ్‌పూర్‌కు వెళ్లి వచ్చేవాడు. 
 
అలాగే, గత శనివారం రాత్రి కూడా రమేశ్ జోథ్‌పూర్ వెళ్లి ఇంటికి ఆలస్యంగా వచ్చాడు. భార్యను భోజనం వడ్డించమని అడగ్గా ఆమె నిరాకరించింది. దీంతో భర్త కోపంతో ఊగిపోయాడు. ఇంట్లో ఉన్న బండరాయితో ఆమె తలపై బాదాడు. ఆ రాయి తలకు బలంగా తగలడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. 
 
ఆ తర్వాత రమేష్.. తన బావమరిదికి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పాడు. దీంతో అతను పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతన్ని అరెస్టు చేసి.. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్యాన్స్ కు పండగలా దేవర వుందా? చివరి 40 నిముషాలు హైలైట్ గా దేవర - ఓవర్ సీస్ రివ్యూ

రోటి కపడా రొమాన్స్‌ విజయం గురించి డౌట్‌ లేదు, అందుకే వాయిదా వేస్తున్నాం

కోర్టు సీన్ తో గుమ్మడికాయ కొట్టిన తల్లి మనసు షూటింగ్

ఫ్యాన్స్ జేబులను లూఠీ చేస్తున్న మూవీ టిక్కెట్ మాఫియా!

సెలెబ్రిటీ లు ఎదుర్కొంటున్న సమస్యలపై మిస్టర్ సెలెబ్రిటీ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

పిల్లల మెదడు ఆరోగ్యానికి ఇవి పెడుతున్నారా?

పొద్దుతిరుగుడు విత్తనాలు ఎందుకు తినాలో తెలుసా?

నల్ల జీలకర్ర నీటిని మహిళలు పరగడుపున తాగితే?

పాలలో తేనె వేసుకుని తాగితే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments