Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజంతా ఎండలో కట్టేశాడనీ... యజమాని తల కొరికేసిన ఒంటె.. ఎలా?

Webdunia
బుధవారం, 25 మే 2016 (13:24 IST)
పగలు, ప్రతీకారాలు, కోపాలు మనుషులకే అనుకుంటే పొరపాటు.... జంతువులు కుడా పగతీర్చుకుంటాయని తెలుసా... అలాంటి ఒక ఘటనే రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. ఆ ఒంటె యజమాని దాన్ని ఎండలో కట్టి ఉంచాడని కోపంతో యజమాని తలను యాపిల్ పండు కొరికినట్టు కొరికి చంపేసింది. 
 
పూర్తి వివరాల్లోకి వెళ్తే... రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లాకు చెందిన ఒక వ్యక్తి తన ఒంటెను యథావిధిగా రాత్రి పూట ఇంటి బయట కట్టేసి ఉంచాడు. అయితే మరుసటి రోజు ఉదయం అనుకోనివిధంగా యజమాని ఇంటికి బంధువులు రావడంతో కట్టేసి ఉంచిన ఒంటెను చల్లటి ప్రదేశంలోకి మార్చడం మర్చిపోయాడు. దీంతో రోజంతా 43 డిగ్రీల ఉష్ణోగ్రతలో సలసల కాగే ఎండలో అది మాడిమాసై పోయింది. 
 
ఒంటెను ఎండలోనే కట్టేసి ఉంచిన విషయం ఆలస్యంగా గుర్తుకు రావడంతో వెంటనే ఒంటెను చల్లటి ప్రదేశానికి మార్చడానికి యజమాని వెళ్లాడు. ఆ యజమానిని చూడగానే ఉక్రోషంతో ఊగిపోయిన ఒంటె ఒక్కసారిగా అతని మీద దాడి చేసి అతని తలను కొరికేసి, అతని పీకను పట్టుకుని అటు ఇటు విసిరికొట్టింది. దీంతో ఆ ఒంటె యజమాని అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు. ఆఖరికి ఆ ఒంటెను 25 మంది గ్రామస్తులు 6 గంటల పాటు శ్రమించి ఒంటెను శాంతింపజేశారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలోని ఒంటె యజమానులు భయాందోళనలకు గురయ్యారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments