Webdunia - Bharat's app for daily news and videos

Install App

దళిత బాలికపై ఎస్ఐ అత్యాచారం.. పట్టుకుని చితకబాదిన స్థానికులు

Webdunia
ఆదివారం, 12 నవంబరు 2023 (10:57 IST)
రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్‌లో ఓ దళిత బాలిక అత్యాచారానికి గురైంది. ఈ దారుణానికి పాల్పడిన కామాంధుడు ఎవరో కాదు. మహిళలతో పాటు సమాజానికి రక్షణ కల్పించాల్సిన పోలీస్ ఎస్ఐ కావడం గమనార్హం. ఈ ఘటన జైపూర్‌ సమీపంలోని దౌసా జిల్లాలో జరిగింది. బాధిత బాలిక వయసు కేవలం నాలుగేళ్లు మాత్రమే. 
 
జిల్లాలోని రహువాస్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న భూపేంద్ర సింగ్ శుక్రవారం బాధిత చిన్నారికి తినుబండారాలు ఆశజూపి తన అద్దె గదిలోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత అఘాయిత్యానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న స్థానికులు ఆగ్రహంతో పోలీస్ స్టేషన్‌ను చుట్టుముట్టి నిందితుణ్ని పట్టుకొని కర్రలు, చెప్పులతో దేహశుద్ధి చేశారు. చిన్నారిపై ఎస్ఐ అత్యాచార ఘటన సమాజానికి సిగ్గుచేటని గవర్నర్ కల్రాజ్ మిశ్రా పేర్కొన్నారు. ఈ కేసులో కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు.
 
మరోవైపు, ఈ కేసులో కామాంధుడైన ఎస్ఐగా పనిచేస్తున్న నిందితుడు భూపేంద్ర సింగ్‌ను సస్పెండ్ చేయడంతోపాటు కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు పోలీసులు శనివారం వెల్లడించారు. బాలికకు వైద్య పరీక్షలు పూర్తయ్యాయని, తన ఆరోగ్యం ప్రస్తుతం స్థిమితంగానే ఉందని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్వరాష్ట్రంలో డిపాజిట్ కోల్పోయిన జోకర్... : ప్రకాష్ రాజ్‌పై నిర్మాత వినోద్ కుమార్ ఫైర్

అభిమానుల రుణం ఈ జన్మలో తీర్చుకోలేను : జూనియర్ ఎన్టీఆర్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments