Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో మరో రాష్ట్ర ముఖ్యమంత్రికి కరోనా పాజిటివ్

Webdunia
గురువారం, 6 జనవరి 2022 (21:04 IST)
దేశంలో కరోనా వైరస్ థర్డ్ వేవ్ మొదలైంది. దీనికి నిదర్శనమే గత 24 గంటల్లో ఏకంగా 90 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్‌బారిన సాధారణ ప్రజలు మాత్రమే కాకుండా రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు పడుతున్నారు. ఇప్పటికే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు కరోనా వైరస్ సోకింది. అలాగే, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అధికారిక నివాసంలో ఏకంగా 40 మందికి ఈ వైరస్ సోకడం సంచలనంగా మారిన విషయం తెల్సిందే. 
 
ఇపుడు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. అయితే, తనలో కరోనా లక్షణాలు పెద్దగా లేవని, వైద్యుల సలహా మేరకు వారం రోజుల పాటు హోం ఐసోలేషన్‌కు పరిమితం కానున్నట్టు తెలిపారు. 
 
అలాగే, కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం గత నాలుగైదు రోజులుగా తనను కలిసినవారందరూ కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే, కరోనా నిబంధనలు పాటిస్తూ, ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని ఆయన కోరారు. దేశంలో కరోనా థర్డ్ వేవ్ మొదలైందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ రెండు డోసుల కరోనా టీకాలు కూడా వేయించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments