Webdunia - Bharat's app for daily news and videos

Install App

రసవత్తరంగా రాజస్థాన్ రాజకీయాలు.. నలుగురు మంత్రులపై వేటు

Webdunia
శుక్రవారం, 23 నవంబరు 2018 (11:25 IST)
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజస్థాన్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. పార్టీలో అంతర్గత పోరు ఆకాశానికి తాకింది. ఫలితంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయరాజే సింథియా సిఫార్సుల మేరకు పార్టీ హైకమాండ్ నలుగురు మంత్రులపై వేటు వేసింది. 
 
ఈ ఎన్నికల్లో టిక్కెట్ ఆశించి భంగపడిన పలువురు నేతలు పార్టీని వీడగా, మరికొందరు తిరుగుబాటు గళమెత్తారు. అలా తిరుగుబాటు చేసిన నేతలపై భాజపా క్రమశిక్షణా చర్యలకు సిద్ధమైంది. 11 మంది రెబల్స్‌ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది. వీరిలో నలుగురు మంత్రులు కూడా ఉండటం గమనార్హం.
 
వీరంతా తమ నామినేషన్లు వెనక్కి తీసుకునేందుకు ఒప్పుకోకపోవడంతో భాజపా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 11 మంది సీనియర్‌ నేతలను ఆరు సంవత్సరాల పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగిస్తున్నట్లు గురువారం భాజపా ఓ ప్రకటన విడుదల చేసింది. శాసనసభ ఎన్నికల్లో పార్టీ వీరికి టికెట్‌ ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో అసంతృప్తి చెందిన వీరు రెబల్స్‌గా నామినేషన్లు దాఖలు చేశారు.
 
ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచే భాజపాకు ఈ రెబల్స్‌ సమస్య మొదలైంది. ఇప్పటికే కొందరు సిట్టింట్‌ ఎమ్మెల్యేలు టికెట్‌ రాకపోవడంతో కాంగ్రెస్‌లో చేరారు. కాగా, రాష్ట్రంలో డిసెంబరు 7న ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబరు 11న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments