Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో మతకలహాలకు బీజేపీ - ఎంఐఎం కుట్ర : రాజ్‌ థాక్రే

Webdunia
మంగళవారం, 4 డిశెంబరు 2018 (11:08 IST)
రామాలయం అంశాన్ని అడ్డుపెట్టుకుని భారతీయ జనతా పార్టీతో పాటు ఎంఐఎంలు దేశంలో మతకలహాలను సృష్టించేందుకు కుట్ర పన్నుతున్నాయని మహారాష్ట్ర నవ్‌నిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ థాక్రే ఆరోపించారు. ముంబైలోని విఖ్రోలిలో జరిగిన ఆ పార్టీ బహిరంగ సభలో పాల్గొని మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి మాట్లాడేందుకు ఒక్క అంశం కూడా లేదన్నారు. అందుకే మత అంశాలను తెరపైకి తెచ్చి, హిందూ - ముస్లిం ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని ఆయన ఆరోపించారు. 
 
అయోధ్యలోని రామాలయం నిర్మాణం విషయంలో మజ్లిస్ పార్టీ, బీజేపీలు దేశంలో అల్లర్లు సృష్టించేందుకు కుట్రపన్నుతున్నాయన్నారు. అయోధ్యలో రామాలయాన్ని నిర్మించాలని తాను కోరుతున్నాననీ, అదేసమయంలో నిర్మాణం విషయంలో అంత కఠినంగా వ్యవహరించబోనని చెప్పారు. 
 
ఇటీవల హనుమంతుడిని దళితుడని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలను రాజ్‌‌థాకరే ఖండించారు. యూపీ, బీహార్ రాష్ట్రాల నుంచి వచ్చిన వారికికాకుండా మహారాష్ట్రలోని స్థానికులకు ఉద్యోగాశాల్లో ప్రాధాన్యం ఇవ్వాలని రాజ్‌‌థాకరే డిమాండ్ చేశారు. వలస వచ్చిన వారి వల్ల మహారాష్ట్రలో స్థానికులు సమస్యలు ఎదుర్కొంటున్నారని రాజ్‌‌ థాక్రే ఆరోపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సిలికాన్‌లో ఏఐ రీసెర్చ్ సెంటర్‌ లో సీఈఓ అరవింద్ శ్రీనివాస్‌ను కలిసిన కమల్ హాసన్

జై శ్రీరామ్ అంటూ తన్మయంతో డాన్స్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

వేర్వేరు లక్ష్యాలతో ఉన్నఇద్దరి ప్రేమ కథతో డియర్ ఉమ విడుదలకు సిద్ధమైంది

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments