Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైలు ప్రయాణికులకు చేదువార్త.. 70 కేజీల బరువు దాటితే పైసలు చెల్లించాల్సిందే..

Webdunia
ఆదివారం, 12 మార్చి 2023 (15:25 IST)
భారతీయ రైల్వే శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇది నిజంగానే రైలు ప్రయాణికులకు చేదువార్త వంటింది. ఏసీ బోగీల్లో ప్రయాణం చేసే రైలు ప్రయాణికుల లగేజీ 70 కేజీలు దాటితో ఇకపై పైసలు చెల్లించాల్సిందేనంటూ కొత్త నిబంధన ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటివరకు ఎంత లగేజీ తీసుకెళ్లినా రైల్వే అధికారులు అభ్యంతరం చెప్పేవాళ్లు కాదు. కానీ, ఇకపై అలా కుదరదని రైల్వే శాఖ తెగేసి చెప్పింది. 
 
ప్రయాణించే తరగతిని బట్టి ఒక్కో ప్రయాణికుడు తీసుకెళ్లే లగేజీపై పరిమితి విధించింది. ఈ పరిమితి దాటి లగేజీని తీసుకెళితే జరిమానా విధించనున్నట్లు తెలిపింది. విమాన ప్రయాణాల తరహాలోనే అదనపు లగేజీకి ఛార్జి చెల్లించాలని రైల్వే శాఖ స్పష్టం చేసింది. అధిక లగేజీతో ప్రయాణించొద్దని, అవసరమైతే లగేజీ పార్శిల్ సర్వీసును ఉపయోగించుకోవాలని రైల్వే శాఖ అధికారిక ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. అలాగే, ఎవరు ఎంత లగేజీని ఉచితంగా తీసుకెళ్లవచ్చో కూడా ప్రకటించింది. 
 
* ఫస్ట్ క్లాస్‌ ఏసీ ప్రయాణికులు 70 కిలోల వరకు లగేజీని తమతో ఫ్రీగా తీసుకెళ్లవచ్చు.
* సెకండ్‌ క్లాస్‌ ఏసీలో 50 కిలోలు, థార్డ్‌ క్లాస్‌ ఏసీ స్లీపర్, ఏసీ చైర్ కార్ క్లాస్‌లలో 40 కిలోల వరకు లగేజీని ఉచితంగా వెంట తీసుకెళ్లవచ్చు. 
* సెకండ్ క్లాస్‌లో 25 కిలోల లగేజీ తీసుకెళ్లేందుకు అనుమతి ఉంటుంది. 
* ఈ పరిమితి దాటితే రూ.30లు లగేజీ ఛార్జీ చెల్లించాలి.
* బుక్‌ చేసుకోకుండా అదనపు లగేజీతో ప్రయాణించే వారికి బ్యాగేజీ విలువకు ఆరు రెట్లు జరిమానా విధిస్తామని రైల్వే హెచ్చరించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

తర్వాతి కథనం
Show comments