Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇల్లంతా షేక్ అవుంతోంది.. బహుశా భూకంపం అనుకుంటా.. రాహుల్ గాంధీ (video)

Webdunia
శనివారం, 13 ఫిబ్రవరి 2021 (11:17 IST)
Rahul Gandhi
ఉత్తరాదిన శుక్రవారం రాత్రి భూమి కంపించింది. ఇంట్లో వున్నప్పుడు భూమి కంపిస్తే.. అందరూ పరుగులు పెడతారు. కానీ ఇక్కడ సీన్ మారింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మాత్రం... తన కూర్చున్న సీట్లోంచీ పైకి కూడా లేవలేదు. వివరాల్లోకి వెళితే.. శుక్రవారం తజకిస్థాన్‌లో భూకంపం వచ్చిన సంగతి తెలిసిందే. దాని ప్రకంపనలు ఉత్తర భారత దేశంలోని చాలా రాష్ట్రాల్లో వచ్చాయి.
 
భూకంపం వచ్చిన సమయంలో రాహుల్ గాంధీ చికాగో యూనివర్శిటీ విద్యార్థులతో జూమ్‌లో వర్చువల్ ఇంటరాక్టింగ్ అవుతున్నారు. ఆ సమయంలో ఇల్లంతా షేక్ అవుతోందనీ బహుశా భూకంపం కావచ్చని విద్యార్థులకు ఆయన తెలిపారు. ఒకట్రెండు సెకండ్లపాటూ రాహుల్ ఇల్లు కంపించింది. అయినప్పటికీ భయపడని ఆయన... ఆ విషయాన్ని అక్కడితో వదిలేసి... వెంటనే విద్యార్థుల విషయాల్లోకి వెళ్లిపోవడం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.
 
నిజానికి ఈ ప్రకంపనలు వచ్చినప్పుడు ఉత్తర భారత్‌లోని ఢిల్లీ, జమ్మూకాశ్మీర్, రాజస్థాన్ సహా చాలా ప్రాంతాల్లో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. వచ్చినవి ప్రకంపనలే అయినప్పటికీ భూకంపం వచ్చిందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దాంతో ప్రజలు చాలా భయపడ్డారు. రాహుల్ మాత్రం నవ్వుతూ… ప్రశాంతంగా కూర్చోవడం అందరికీ షాకిచ్చింది. ప్రస్తుతం రాహుల్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తర్వాతి కథనం
Show comments