ఇల్లంతా షేక్ అవుంతోంది.. బహుశా భూకంపం అనుకుంటా.. రాహుల్ గాంధీ (video)

Webdunia
శనివారం, 13 ఫిబ్రవరి 2021 (11:17 IST)
Rahul Gandhi
ఉత్తరాదిన శుక్రవారం రాత్రి భూమి కంపించింది. ఇంట్లో వున్నప్పుడు భూమి కంపిస్తే.. అందరూ పరుగులు పెడతారు. కానీ ఇక్కడ సీన్ మారింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మాత్రం... తన కూర్చున్న సీట్లోంచీ పైకి కూడా లేవలేదు. వివరాల్లోకి వెళితే.. శుక్రవారం తజకిస్థాన్‌లో భూకంపం వచ్చిన సంగతి తెలిసిందే. దాని ప్రకంపనలు ఉత్తర భారత దేశంలోని చాలా రాష్ట్రాల్లో వచ్చాయి.
 
భూకంపం వచ్చిన సమయంలో రాహుల్ గాంధీ చికాగో యూనివర్శిటీ విద్యార్థులతో జూమ్‌లో వర్చువల్ ఇంటరాక్టింగ్ అవుతున్నారు. ఆ సమయంలో ఇల్లంతా షేక్ అవుతోందనీ బహుశా భూకంపం కావచ్చని విద్యార్థులకు ఆయన తెలిపారు. ఒకట్రెండు సెకండ్లపాటూ రాహుల్ ఇల్లు కంపించింది. అయినప్పటికీ భయపడని ఆయన... ఆ విషయాన్ని అక్కడితో వదిలేసి... వెంటనే విద్యార్థుల విషయాల్లోకి వెళ్లిపోవడం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.
 
నిజానికి ఈ ప్రకంపనలు వచ్చినప్పుడు ఉత్తర భారత్‌లోని ఢిల్లీ, జమ్మూకాశ్మీర్, రాజస్థాన్ సహా చాలా ప్రాంతాల్లో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. వచ్చినవి ప్రకంపనలే అయినప్పటికీ భూకంపం వచ్చిందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దాంతో ప్రజలు చాలా భయపడ్డారు. రాహుల్ మాత్రం నవ్వుతూ… ప్రశాంతంగా కూర్చోవడం అందరికీ షాకిచ్చింది. ప్రస్తుతం రాహుల్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 date: బాలక్రిష్ణ అఖండ 2 రిలీజ్ డేట్ ను ప్రకటించిన నిర్మాతలు - డిసెంబర్ 12న రిలీజ్

ఆహ్వానించేందుకు వచ్చినపుడు షూటింగ్‌లో డ్యాన్స్ చేస్తున్నా : చిరంజీవి

పవన్ కల్యాణ్‌కు మొండి, పట్టుదల ఎక్కువ.. ఎక్కడా తలొగ్గడు.. జయసుధ (video)

శాంతారామ్ బయోపిక్‌లో తమన్నా.. పోస్టర్ రిలీజ్ చేసిన టీమ్.. లుక్ అదుర్స్

శర్వా... నారి నారి నడుమ మురారి రిలీజ్-ముహూర్తం ఖరారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

పది లక్షల మంది పిల్లల్లో ప్రకటనల అక్షరాస్యతను పెంపొందించే లక్ష్యం

తమలపాకులు ఎందుకు వేసుకోవాలి?

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments