Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాహుల్ త్వరలోనే ప్రజాజీవితంలోకి వస్తాడు : సోనియా

Webdunia
శనివారం, 28 మార్చి 2015 (20:15 IST)
తన కుమారుడు రాహుల్ గాంధీ అజ్ఞాతవాసంపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తాజాగా స్పందించారు. రాహుల్ బాబు త్వరలోనే ప్రజా జీవితంలోకి వస్తారంటూ వ్యాఖ్యానించారు. అలాగే, అమేథీలో జరిగిన రైలు ప్రమాద మృతుల కుటుంబాలను ఆయన పరామర్శిస్తారని తెలిపారు. 
 
పార్లమెంట్ సమావేశాలకు సైతం డుమ్మాకొట్టి గత కొంతకాలంగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ ఎవరికీ కనిపించకుండా తప్పించుకుని తిరుగుతున్న విషయం తెల్సిందే. దీనిపై ఇప్పటికే పలు పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నా.. రాహుల్ గాంధీ మాత్రం మిన్నుకుండి పోయారు. రాహుల్ ఎక్కడకు వెళ్లారనే అంశం అటు నాయకుల నుంచి ఇటు ప్రజల్లో కూడా చర్చనీయాంశంగా మారింది.
 
ఈ నేపథ్యంలో రాహుల్ తల్లి, ఏఐసీసీ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ తాజాగా స్పందించారు. రాహుల్ బాబు త్వరలోనే ప్రజా జీవితంలోకి వస్తాడంటూ స్పష్టం చేశారు. కాగా, రాహుల్ ఎప్పుడూ తిరిగి వస్తారనే దానిపై సోనియా స్పష్టత ఇవ్వలేదు. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments