Webdunia - Bharat's app for daily news and videos

Install App

అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తాం: రాహుల్ గాంధీ

Webdunia
శనివారం, 12 జనవరి 2019 (12:06 IST)
కేంద్రంలో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. విభజన తర్వాత ఏపీకి దక్కాల్సిన న్యాయమైన హామీలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విస్మరించారని.. మనం కలిసి ఏపీకి ఇవ్వాల్సిన రుణం గురించి మోదీకి, కేంద్ర సర్కారుకు అర్థమయ్యేలా చెప్పాలని రాహుల్ గాంధీ దుబాయ్‌లో అన్నారు. 
 
దుబాయ్‌లో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ.. భారతీయ కార్మికులను కలిసి వారితో పలు అంశాలపై ముచ్చటించారు. గత ఏడాది ఢిల్లీ జంతర్‌మంతర్‌లో ఏపీ నేతల ఆందోళన సందర్భంగా తాను ప్రత్యేక హోదాపై ప్రకటన చేశానని.. దానికి కట్టుబడి ఉన్నానని చెప్పారు. 
 
విభజనతో నష్టపోయిన ఏపీకి న్యాయం జరగాల్సిందేనని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. దుబాయ్‌ అభివృద్ధిలో భారతీయ కార్మికుల పాత్ర కీలకమని రాహుల్ గాంధీ ఈ సందర్భంగా కొనియాడారు. దుబాయ్‌లో ఉన్న రాహుల్.. భారత పారిశ్రామికవేత్తలతోనూ సమావేశమయ్యారు. స్వదేశంలో పెట్టుబడులు పెట్టి యువతకు ఉద్యోగాలు కల్పించాలని, వ్యవసాయాభివృద్ధికి సహకరించాలని వారిని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments