ప్రధాని మోడీకి - అదానీకి ఉన్న సంబంధం ఏంటి? : రాహుల్ ప్రశ్న

Webdunia
మంగళవారం, 7 ఫిబ్రవరి 2023 (17:04 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, భారత పారిశ్రామికవేత్త అదానీకి మధ్య ఉన్న సంబంధం ఏంటని పార్లమెంట్ వేదికగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సూటింగా ప్రశ్నించారు. నరేంద్ర మోడీ గుజరాత్ నుంచి ఢిల్లీకి రాగానే అసలు మ్యాజిక్ మొదలైందన్నారు. అదానీ అస్తి విలువ బిలియన్ డాలర్ల నుంచి ఏకంగా 140 బిలియన్ డాలర్లకు ఎలా చేరిందని ఆయన ప్రశ్నించారు. 
 
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాహుల్ గాంధీ మంగళవారం లోక్‌సభలో మాట్లాడారు. గుజరాత్ సీఎంగా నరేంద్ర మోడీ ఉన్నపుడు ఈ అనుబంధం మొదలైంది. మోడీతో కలిసి ఓ వ్యక్తి తిరిగేవాడు. ఆయనకు నమ్మకంగా ఉండేవాడు. 2014లో ఢిల్లీకి మోడీ చేరుకున్నాక అసలు మ్యాజిక్ మొదలైంది" అని ఎద్దేవా చేసాడు. అదానీ అంశంపై పార్లమెంట‌్‌లో చర్చ జరుగకుండా ప్రధాని మోడీ సర్కారు అన్ని రకాలైన ప్రయత్నాలు చేస్తుందని ఆరోపించారు. 
 
అదానీ దాదాపు 10 రంగాల్లో వ్యాపారం చేస్తున్నారని గుర్తు చేసిన రాహుల్.. 2014 నుంచి 2022 మధ్య ఆయన ఆస్తులు బిలియన్ డాలర్ల నుంచి 140 బిలియన్ డాలర్లకు ఎలా వెళ్లాయని యువత అడుగుతున్నారని ప్రశ్నించారు. ప్రపంచ కుబేరుల్లో 600వ ర్యాంకులో ఉన్న అదానీ.. రెండో ర్యాంకుకు ఎలా చేరుకున్నారని రాహుల్ ప్రశ్నించారు. 
 
ముఖ్యంగా, సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ వంటి ఏ వ్యాపారంలోనైనా అదానీ ఎపుడూ విఫలం కాలేదన్నారు. అనేక రంగాల్లో అదానీ ఇంత విజయాన్ని సాధించారని తాను పూర్తి చేసిన భారత్ జోడో యాత్రలో అనేక మంది యువత ప్రశ్నించారని, అస్సలు మోడీకి, అదానీకి ఉన్న సంబంధం ఏమిటని రాహుల్ లోక్‌సభ వేదికగా నిలదీశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments