Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్టీసీ బస్సు ఎక్కిన రాహుల్ గాంధీ.. ప్రయాణీకులతో ముచ్చట్లు

సెల్వి
శుక్రవారం, 10 మే 2024 (07:51 IST)
Rahul Gandhi
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ గురువారం రాత్రి బహిరంగ సభలో ప్రసంగించిన తర్వాత గ్రేటర్ హైదరాబాద్‌లోని రాష్ట్ర రోడ్డు మార్గాల బస్సులో ప్రయాణించి అందరనీ ఆశ్చర్యపరిచారు. తోటి  ప్రయాణికులతో మాట్లాడారు. 
 
మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గంలోని సరూర్‌నగర్‌లో బహిరంగ సభ ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డితో కలిసి కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) బస్సు ఎక్కారు.
 
రాహుల్ గాంధీ ‘పంచ న్యాయ్’ బ్రోచర్లను ప్రయాణికులకు పంచి, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణ పథకంపై ఆరా తీశారు.  ప్రయాణీకులతో ముచ్చటించిన రాహుల్ గాంధీ మహిళలు, యువత, రైతులు, కార్మికులు వంటి వివిధ వర్గాల కోసం కాంగ్రెస్ తన జాతీయ మేనిఫెస్టోలో చేసిన వాగ్దానాలను వారికి వివరించారు.
 
రాహుల్ గాంధీ తమతో పాటు ప్రయాణిస్తున్నట్లు చూసిన ప్రయాణికులు ఆశ్చర్యానికి లోనవగా, పలువురు ఆయనతో సెల్ఫీలు దిగారు. అంతకుముందు, రాహుల్ గాంధీ బహిరంగ సభలో తన ప్రసంగంలో, రాజ్యాంగాన్ని తొలగించడానికి బిజెపి యోచిస్తోందని ఆరోపించారు. దానిని పరిరక్షిస్తానని ప్రతిజ్ఞ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nara Lokesh: పవన్ కల్యాణ్ అన్న స్వాగ్ నాకు చాలా ఇష్టం: నారా లోకేష్

Pawan: సత్యానంద్ నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నా : పవన్ కళ్యాణ్

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

షూటింగ్ లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ కు స్వల్పగాయాలు !

అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ సరైన సినిమా లేదు: నిర్మాత నాగవంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం
Show comments