Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడీనే కాదు.. హిట్లర్‌, ముస్సోలినీ కూడా శక్తివంతమైన బ్రాండ్లే : రాహుల్

దేశ కరెన్సీ నోట్లపై జాతిపిత మహాత్మా గాంధీ బొమ్మ ఉండటం వల్లే కరెన్సీ విలువ పడిపోతుందంటూ హర్యానా మంత్రి అనిల్ విజ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్విట్టర్‌లో తీవ్రంగా స్పందించారు.

Webdunia
సోమవారం, 16 జనవరి 2017 (05:35 IST)
దేశ కరెన్సీ నోట్లపై జాతిపిత మహాత్మా గాంధీ బొమ్మ ఉండటం వల్లే కరెన్సీ విలువ పడిపోతుందంటూ హర్యానా మంత్రి అనిల్ విజ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్విట్టర్‌లో తీవ్రంగా స్పందించారు. హిట్లర్‌, ముస్సోలినీ కూడా శక్తివంతమైన బ్రాండ్లేనని వ్యంగ్యంగా అన్నారు.
 
అలాగే, కాంగ్రెస్ మీడియా విభాగం ముఖ్య ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా మాట్లాడుతూ.. 'గాంధీని చంపగలిగారు. ఆయన ఫొటోలు తీసేయగలిగారు. దేశ ప్రజల గుండెల్లోంచి ఆయన్ను తొలగించలేరు' అని వ్యాఖ్యానించారు.
 
అదేవిధంగా మహాత్మా గాంధీ ముని మనుమడు తుషార్‌ గాంధీ మాట్లాడుతూ.. 'హర్యానా మంత్రి హైకమాండ్‌ చెప్పినట్లు వింటున్నారని, ఆర్‌ఎ‌స్ఎస్‌ భాష మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు.
 
ఖాదీ, కుటీర పరిశ్రమల కమిషన్‌ తాజా కేలండర్‌లో గాంధీకి బదులుగా ప్రధాని మోడీ ఫొటో వేయడంపై వ్యక్తమైన విమర్శలకు మంత్రి అనిల్ విజ్ స్పందించారు. "ఖాదీపై గాంధీ పేరుకేమీ పేటెంట్‌ లేదు. ఖాదీకి గాంధీ పేరును లింకు చేసినప్పటి నుంచే పరిశ్రమ పతనమైపోయింది. గాంధీ బొమ్మను కరెన్సీ నోట్లపై వేసినప్పటి నుంచి రూపాయి విలువ తగ్గడమే కానీ పెరగడం లేదు" అని విజ్‌ వ్యాఖ్యానించారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments