Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాహుల్ 'ఖాట్‌‌పే' చర్చ ముగియగానే మంచాల కోసం ఘర్షణ... ఎక్కడ?

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేపట్టిన కిసాన్ యాత్రలో భాగంగా రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. దీనికి 'ఖాట్‌‌పే చర్చ' అనే నామకరణం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా రైతులు, రాహుల్‌ కూర

Webdunia
బుధవారం, 7 సెప్టెంబరు 2016 (06:53 IST)
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేపట్టిన కిసాన్ యాత్రలో భాగంగా రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. దీనికి 'ఖాట్‌‌పే చర్చ' అనే నామకరణం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా రైతులు, రాహుల్‌ కూర్చొని మాట్లాడుకొనేందుకు 2 వేల కొత్త మంచాలను కాంగ్రెస్ నేతలు తయారు చేయించారు. 
 
ఈ రైతులతో ముఖాముఖి చర్చా కార్యక్రమం ముగిసిందో లేదో సభకు హాజరైన రైతులు, ప్రజలు కొత్త మంచాలను తమ ఇళ్లకు తీసుకెళ్లేందుకు ఎగబడ్డారు. దీంతో సభాప్రాంగణంలో పెద్ద ఎత్తున ఘర్షణ చోటుచేసుకొంది. సభ ముగిసిన కొద్ది నిమిషాలకే అక్కడ ఏర్పాటు చేసిన 2 వేల మంచాలు మాయమైపోయి సభాప్రాంగణం బోసిపోయి కనిపించింది. 
 
అయితే తొలిరోజే ఖాట్‌పే చర్చ రసాభాసగా మారడంతో కాంగ్రెస్‌ పెద్దలు దీనిపై పునరాలోచనలో పడ్డారు. కాంగ్రెస్‌ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత కిషోర్‌ ‘ఖాట్‌పే చర్చ’ ఆలోచనను తెరపైకి తెచ్చిన విషయం తెల్సిందే. ఇదిలావుండగా, వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలోని డియోరియా నుంచి ఢిల్లీ వరకు 2500 కిలోమీటర్ల మేర కిసాన్‌ యాత్రను రాహుల్‌ మంగళవారం ప్రారంభించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments