Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాహుల్ గాంధీకి శ్రీనగర్‌లో చుక్కెదురు.. రావొద్దని అడ్డుకున్నారు..?

Webdunia
శనివారం, 24 ఆగస్టు 2019 (11:12 IST)
కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ అధినేత రాహుల్ గాంధీకి శ్రీనగర్‌లో చుక్కెదురైంది. కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో 12 మంది సభ్యులతో కూడిన రాహుల్ గాంధీ బృందం పర్యటన చేపట్టింది. కానీ ప్రస్తుతం కాశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితులపై పరిశీలించేందుకు రంగంలోకి దిగిన రాహుల్ బృందాన్ని అక్కడి అధికారులు అడ్డుకున్నారు. 
 
రాజకీయ నేతలు కొంత కాలం పాటు కాశ్మీర్‌లో అడుగుపెట్టవద్దన్నారు. కాశ్మీర్ లోయలో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని, నేతల పర్యటనలతో ఆటంకం కలిగించొద్దని కాశ్మీర్ పౌర సంబంధాల శాఖ అధికారులు డిమాండ్ చేస్తున్నారు. 
 
ఇంకా రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ కూడా  శ్రీనగర్ పర్యటనకు వెళ్లనున్నారు. ఇక వీరితో పాటు  అఖిలపక్ష నేతలు కూడా వెంట వెళ్లనున్నారు. సీపీఎంకు చెందిన సీతారాం ఏచూరి, సీపీఐ నేత డి. రాజా, డీఎంకే నేత తిరుచి శివ, ఆర్జేడీ మనోజ్ ఝా, టీఎంసీ నేత దినేష్ త్రివేది కూడా శ్రీనగర్‌లో పర్యటించనున్నారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం