Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైతులను పట్టించుకోని నరేంద్ర మోడీ.. '0 out of 10: రాహుల్ గాంధీ

Webdunia
సోమవారం, 18 మే 2015 (16:48 IST)
దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మండిపడ్డారు. దేశ ప్రధానిగా మోడీ విదేశీ పర్యటనలు చేస్తున్నారే తప్ప... రైతులను కలసి, వారి కష్టాలను తెలుసుకోవడం లేదని రాహుల్ విమర్శలు కురిపించారు. మోడీకి రైతులను పట్టించుకునే సమయం కూడా లేదని మండిపడ్డారు. ఈ విషయంలో మోడీ ప్రభుత్వానికి 10 మార్కులకుగాను సున్నా మార్కులు వచ్చాయని ఎద్దేవా చేశారు. 
 
తన సొంత నియోజకవర్గం అమేథీలో పర్యటించిన రాహుల్ గాంధీ... అక్కడ పంట నష్టపోయిన రైతులను కలుసుకున్నారు. మూడు రోజుల పాటు ఆయన అమేథీ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఎంపీ నిధుల నుంచి నిర్మించతలపెట్టిన పలు ప్రాజెక్టులకు రాహుల్ శంకుస్థాపన చేస్తారని యూపీ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి రాజీవ్ సింగ్ తెలిపారు. మరోవైపు చైనా పర్యటన విజయవంతంగా ముగించుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సోమవారం దక్షిణ కొరియాకు ప్రయాణమైన సంగతి తెలిసిందే.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments