Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంట్లో భోజనం చేసి తల్లిని పరామర్శించి ఈడీ ఆఫీసుకు వచ్చిన రాహుల్

Webdunia
సోమవారం, 13 జూన్ 2022 (17:00 IST)
కాంగ్రెస్ పూర్వ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మళ్లీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి చేరుకున్నారు. నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ ఆర్థిక అవకతవకల కేసులో విచారణ జరిపేందుకు ఈడీ అధికారులు రాహుల్‌తో పాటు.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి సమన్లు జారీచేసింది. అయితే, సోనియా గాంధీకి కరోనా వైరస్ సోకింది. దీంతో ఆమె హాజరుకాలేక పోయారు. 
 
కానీ రాహుల్ గాంధీ మాత్రం సోమవారం ఈడీ విచారణకు వచ్చారు. ఉదయం 11.30 గంటలకు కార్యాలయానికి రాగా, ఆయనను ఈడీ అధికారులు 3 గంటల పాటు విచారించారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో మధ్యాహ్న భోజనం చేసేందుకు రాహుల్ గాంధీ ఇంటికి వెళ్లేందుకు అధికారులు అనుమతించారు. 
 
దీంతో ఆయన ఈడీ కార్యాలయం నుంచి నేరుగా ఇంటికి వెళ్లిన రాహుల్.. అక్కడ భోజనం చేసి ఆ తర్వాత ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన తల్లి సోనియా గాంధీని పరామర్శించారు. అక్కడ నుంచి మళ్లీ ఈడీ కార్యాలయానికి వచ్చి అధికారుల విచారణకు హాజరయ్యారు. దీంతో రాహుల్ వద్ద మళ్లీ విచారణ కొనసాగిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anupama : దెయ్యంలా వుంటావని అమ్మ తిడుతుండేది : అనుపమ పరమేశ్వరన్

Ileana: నేను తల్లిని కాదని అనిపించిన సందర్భాలున్నాయి.. ఇలియానా

త్వరలోనే తల్లి కాబోతున్న పవన్ హీరోయిన్ పార్వతీ మెల్టన్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

జాతీయ పోషకాహార మాసం: మీ రోజువారీ పోషణను బాదం ఎలా మెరుగుపరుస్తుంది?

Lotus Root: తామర పువ్వు వేర్లను సూప్స్‌, సలాడ్స్‌లో ఉపయోగిస్తే?

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

తర్వాతి కథనం
Show comments