Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇదేం విధానం?.. మోదీపై రాహుల్ ఫైర్

Webdunia
శనివారం, 13 జూన్ 2020 (17:23 IST)
కరోనా కేసులు దేశవ్యాప్తంగా రోజురోజుకూ పెరిగిపోతున్న క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై  కాంగ్రెస్‌ నేత, ఎంపీ రాహుల్‌ గాంధీ  ఆగ్రహం వ్యక్తం చేశారు.

'పిచ్చితనంతో పదే పదే ఒకే పనిని చేస్తూ భిన్నమైన ఫలితాలను ఆశిస్తున్నారంటూ' కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ ఆయన ట్వీట్‌ చేశారు.

ఈ మేరకు తన ట్విటర్‌ ఖాతాలో.. లాక్‌డౌన్‌ నాలుగు దశల్లో దేశ వ్యాప్తంగా కరోనా కేసులు నమోదైన తీరును గ్రాఫ్‌ల ద్వారా చూపించారు.

కాగా, మార్చి 24న ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటన చేసినప్పటికి దేశవ్యాప్తంగా కేవలం 500 కరోనా కేసులు ఉన్నాయి. రెండు నెలల సుదీర్ఘ లాక్‌డౌన్‌ అనంతరం ప్రస్తుతం భారత్‌లో 3 లక్షలకు పైగా కేసులు, 8 వేలకు పైగా మరణాలు నమోదయ్యాయి.

దేశంలో గడిచిన రెండు రోజుల్లో అత్యధికంగా రోజుకు 10 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా మోడీ ప్రభుత్వం అన్‌లాక్‌ 1.0 పేరుతో సడలింపులు ఇచ్చింది.

దీంతో రాష్ట్రాల మధ్య రాకపోకలు, విమానాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. దేశవ్యాప్తంగా రెస్టారెంట్లు, షాపింగ్‌ మాల్స్‌, ప్రార్థనా మందిరాలు తెరచుకోవడానికి అనుమతులు ఇచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న అరి’సినిమా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments