Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాహుల్ గాంధీకి అస్వస్థత - ఎన్నికల ప్రచారం రద్దు

ఠాగూర్
గురువారం, 23 జనవరి 2025 (17:59 IST)
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన తన ఢిల్లీ ఎన్నికల ప్రచారాన్ని, ర్యాలీని రద్దు చేసుకున్నారు. వైద్యుల సలహా మేరకు రాహుల్ విశ్రాంతి తీసుకుంటున్నారు. వచ్చే నెల ఐదో తేదీన ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికల పోలింగ్ జరుగనుంది. దీంతో ఢిల్లీలో ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతుంది. కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థుల తరపున రాహుల్ ప్రచారం చేస్తున్నారు. 
 
ఢిల్లీలోని ముస్తఫాబాద్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సమయంలో రాహుల్ అస్వస్థతకు లోనయ్యారు. ఆయనను పరీక్షించిన వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీంతో రాహుల్ తన ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకున్నారని ఢిల్లీ పీసీసీ చీఫ్ దేవేంద్ర యాదవ్ తెలిపారు. 
 
అయితే, శుక్రవారం మాత్రం యధావిధిగా రాహుల్ ఎన్నికల ప్రచారం సాగుతుందని చెప్పారు. భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించే అవకాశం ఉందని తెలిపారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఏ పార్టీకి మద్దతు ఇవ్వడం లేదని, ఒంటరిగానే పోటీ చేస్తున్నామనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలని సూచించారు. కాగా, భారత గణతంత్ర వేడుకల తర్వాత ఈ ఎన్నికల ప్రచారం మరింత ముమ్మరంకానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అసలు మీ సమస్య ఏంటి? జర్నలిస్టుపై మండిపడిన పూజాహెగ్డే

పూజా హెగ్డేలో ప్రేమలో పడింది.. ఘాటుగా లిప్ కిస్.. ట్రెండింగ్‌లో బుట్టబొమ్మ (video)

సెల్ఫీ కోసం వచ్చిన మహిళా ఫ్యాన్స్‌కు ముద్దు పెట్టిన ఉదిత్.. ఏకంగా లిప్ లాక్ (video)

పుష్ప 2కు ముందే వైల్డ్ ఫైర్ షో చేశాం - సినిమాలూ చేస్తున్నా : ఫరియా అబ్దుల్లా

తనికెళ్ల భరణి ప్రధాన పాత్రలో క్రైమ్ థ్రిల్లర్ అసుర సంహారం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ తొలి పీడియాట్రిక్ బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్‌

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం: క్యాన్సర్ ఛాంపియన్‌ల కోసం హెచ్‌సిజి క్యూరీ క్యాన్సర్ సెంటర్ పికిల్‌బాల్ టోర్నమెంట్‌

టీకన్సల్ట్ ద్వారా సమగ్ర ఆరోగ్య సంరక్షణ: మంతెన సత్యనారాయణ రాజు ఆరోగ్య ప్రసంగం

స్ట్రాబెర్రీలు తింటే 7 ఆరోగ్య ప్రయోజనాలు

ఆడోళ్లకు కూడా కండోమ్స్ వచ్చేశాయి.. ఎలా వాడాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments