Webdunia - Bharat's app for daily news and videos

Install App

నదిలో కొట్టుకునిపోయిన ట్రాక్టర్... పది మంది గల్లంతు.. ఎక్కడ?

ఠాగూర్
మంగళవారం, 16 సెప్టెంబరు 2025 (14:34 IST)
ఉప్పొంగి ప్రవహిస్తున్న ఓ నదిలో ట్రాక్టర్ ఒకటి కొట్టుకుని పోయింది. ఆ సమయంలో ఇందులో ప్రయాణిస్తున్న 10 మంది గల్లంతయ్యారు. వీరంతా కూలీలుగా భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన షాకింగ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటన గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్‌లో జరిగింది. 
 
స్థానికులు వెల్లడించిన వివరాల మేరకు... పది మంది కూలీలు ఓ ట్రాక్టర్‌లో ఉప్పొంగి ప్రవహిస్తున్న నదిని దాటుతున్నారు. ఆ ట్రాక్టర్ నది మధ్యలోకి ఆగిపోయింది. దీంతో భయాందోళనకుగురైన కూలీలు ప్రాణభయంతో కాపాడాలంటూ కేకలు వశారు. అయితే, నదిలో నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగిపోవడంతో ట్రాక్టర్ కాస్త బోల్తాపడింది. దీంతో అందులోని వారంతా నీటిలో కొట్టుకునిపోయి గల్లంతయ్యారు. 
 
దీంతో నది ఒడ్డున ఉన్న గ్రామస్థులు నిస్సహాయంగా చూస్తుండిపోయారు. కూలీల కుటుంబ సభ్యులు రోదిస్తూ నది ఒడ్డున పరుగులు తీశారు. తమ వారిని కాపాడుకునేందుకు ఆరాటపడ్డారు. అయితే, నీటి ప్రవాహం ఉధృతంగా ఉండటంతో కొన్ని క్షణాల్లోనే ఆ కూలీలంతా గల్లంతయ్యారు. వీరంతా చనిపోయివుంటారన ి కుటుంబీకులు భావిస్తున్నారు. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhanush: ధనుష్‌ ఇడ్లీ కొట్టుకి యూ సెన్సార్ సర్టిఫికేట్

Tiruveer : ప్రీ వెడ్డింగ్ షో లో తిరువీర్, టీనా శ్రావ్య లపై రొమాంటిక్ సాంగ్

Akshaye Khanna: ప్రశాంత్ వర్మ.. మహాకాళి నుంచి శుక్రాచార్యుడిగా అక్షయ్ ఖన్నా ఫస్ట్ లుక్

అతిపెద్ద పైరసీ రాకెట్‌ను ఛేదించిన హైదరాబాద్ పోలీసులు

Vijay: నిజం బయటకువస్తుంది - త్వరలో బాధితులను కలుస్తానంటున్న విజయ్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

భారతదేశంలో వైభవోపేతంగా అడుగుపెట్టిన హెచ్ అండ్ ఎం బ్యూటీ కాన్సెప్ట్

కాలేయ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు ఎలా వుంటాయి?

బాదం పప్పులు రోజుకి ఎన్ని తినాలి? ప్రయోజనాలు ఏమిటి?

భారతదేశంలో లాంచ్ అయిన ఫర్ ఎవర్ మార్క్ డైమండ్ జ్యుయలరి

తర్వాతి కథనం
Show comments