Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంకపై కుందేలు మాంసం తినొచ్చు... చట్టబద్ధంగా విక్రయాలు!

పుర్రెకో బుద్ధి... జిహ్వకో రుచి అంటుంటారు కదా! అందుకే... మాంసాహారాన్ని ఇష్టపడే వారికి మరో రకం మాసం అందుబాటులోకి రానుంది. ఇకపై దేశవ్యాప్తంగా కుందేలు మాంసం అందుబాటులోకి రానుంది.

Webdunia
గురువారం, 28 జులై 2016 (10:16 IST)
పుర్రెకో బుద్ధి... జిహ్వకో రుచి అంటుంటారు కదా! అందుకే... మాంసాహారాన్ని ఇష్టపడే వారికి మరో రకం మాసం అందుబాటులోకి రానుంది. ఇకపై దేశవ్యాప్తంగా కుందేలు మాంసం అందుబాటులోకి రానుంది. ఈ మేరకు ఆహార భద్రతా చట్టానికి కేంద్రం తాజాగా మార్పులు చేసింది. 
 
వాస్తవానికి కేరళ, జమ్మూకాశ్మీర్‌, హిమాచల్‌ప్రదేశ్‌, ఈశాన్య రాష్ట్రాల్లోని చాలామంది కుందేలు, చెవుల పిల్లుల మాంసాన్ని ఆరగిస్తుంటారు. కేరళలో అయితే ఏకంగా 15 వేల కుటుంబాలు ఈ మాంసం కోసమే కుందేళ్ళను పెంచుతూ జీవిస్తున్నారు. 
 
అయితే, దేశ వ్యాప్తంగా కుందేలు మాంసాన్ని తినడానికి ఆహార భద్రత, ప్రమాణాల సాధికార సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) అనుమతి లేదు. కేవలం గొర్రెలు, మేకలు, పందులు, గేదెలు, అడవిదున్న వంటి పశుమాంసాన్ని తినడానికే ఇది అనుమతిచ్చింది. 
 
ఈ నేపథ్యంలో, కుందేలు మాంసాన్ని కూడా ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ అనుమతి జాబితాలో చేర్చాలని ప్రధానమంత్రి కార్యాలయానికి భారీగా వినతులు వచ్చాయి. దీంతో, ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ప్రధాని తమను ఆదేశించారని, అందుకే కుందేలు మాంసాన్ని కూడా ఈ జాబితాలోని చేర్చినట్లు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ వర్గాలు ప్రకటించాయి. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mumait Khan: ముమైత్ ఖాన్ తాజా లుక్ చూస్తే.. వాళ్లంతా పడిపోతారు.. (Photos)

క్రైమ్ వరల్డ్ నేపథ్యానికి భిన్నంగా నాని HIT: The 3rd Case

15వ దాదాఫాల్కే ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ ఫిలిం కేటగిరీలో కిరణ్ అబ్బవరం క సినిమా

హ్యాట్రిక్ హిట్ రావడం ఆనందంగా ఉంది- ఇంద్రగంటి మోహనకృష్ణ

అఖండ 2: తాండవం జార్జియా లొకేషన్స్ లో బోయపాటి శ్రీను పుట్టినరోజు వేడుక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

తర్వాతి కథనం
Show comments