Webdunia - Bharat's app for daily news and videos

Install App

జాతీయ పతాకాన్ని ట్విట్టర్ ప్రొఫైల్‌ పిక్‌గా పెట్టుకోండి : ప్రధాని పిలుపు

Webdunia
ఆదివారం, 31 జులై 2022 (17:14 IST)
భారత 75వ స్వాతంత్ర్య వేడుకలు ఆగస్టు 15వ తేదీన దేశ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరుతో ఈ వేడుకలను నిర్వహిచనుంది. ఈ నేపథ్యంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా, ఆగస్టు 15వ తేదీన దేశంలోని ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని ప్రధాని ఇప్పటికే పిలుపునిచ్చారు. 
 
ఇపుడు కొత్తగా 75వ స్వాతంత్ర్య దినోత్సవాల నేపథ్యంలో దేశ ప్రజలంతా తమ సోషల్ మీడియా ఖాతాల్లో జాతీయ జెండాను ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సూచించారు. ఈ మేరకు ఆదివారం జరిగిన మన్ కీ బాత్ రేడియో కార్యక్రమంలో ఆయన విజ్ఞప్తి చేశారు. 
 
పింగళి వెంకయ్య జ్ఞాపకంగా..
భారత జాతీయ పతాకాన్ని రూపొందించిన పింగళి వెంకయ్య జయంతి రోజైన ఆగస్టు 2వ తేదీ నుంచి స్వాతంత్ర్య దినోత్సవమైన ఆగస్టు 15వ తేదీ వరకు.. ప్రొఫైల్ పిక్‌గా జాతీయ జెండాను పెట్టుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ కోరారు. 'భారత దేశం 75 ఏళ్ల స్వాతంత్ర్యాన్ని పూర్తి చేసుకుంటోంది. ఈ చరిత్రాత్మక ఘట్టానికి మనందరం సాక్షులు కాబోతున్నాం' అని పేర్కొన్నారు.
 
కేంద్ర ప్రభుత్వ వర్గాల ప్రకారం 'హర్ ఘర్ తిరంగా' కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 13, 14, 15 తేదీల్లో దేశవ్యాప్తంగా సుమారు 20 కోట్ల నివాసాలపై జాతీయ జెండాను ఎగరవేయనున్నట్టు అంచనా.
 
ఈ కార్యక్రమం కోసమని జాతీయ జెండాల తయారీకి సంబంధించిన కోడ్‌ను కూడా కేంద్ర ప్రభుత్వం సడలించింది. పాలిస్టర్, కాటన్, ఉన్ని, సిల్క్, ఖాదీ వస్త్రాలన్నింటినీ జాతీయ జెండా తయారీకి వినియోగించవచ్చని పేర్కొంది. 
 
అదేవిధంగా జెండా పరిమాణంపైగానీ, ఎగరవేసే సమయంపైగానీ ఉన్న ఆంక్షలను కొద్దిరోజుల పాటు సడలిస్తున్నట్టు ప్రకటించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అనన్య నాగళ్ల లాంచ్ చేసిన 23 మూవీ కోసీ కోయ్యంగానే సాంగ్

ఓదెల 2 సినిమా బడ్జెట్ గురించి మేము ఆలోచించలేదు : నిర్మాత డి మధు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments