Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్రగ్ మాఫియాకు మహిళా ఇన్‌స్పెక్టర్ బలి

Webdunia
శనివారం, 30 మార్చి 2019 (12:45 IST)
పంజాబ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ మహిళా ఇన్‌స్పెక్టర్‌ను డ్రగ్ మాఫియా చంపేసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, పంజాబ్ రాష్ట్ర ఆరోగ్య శాఖలో నేహా షూరీ అనే మహిళ డ్రగ్ విభాగంలో ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తోంది. ఈమె పదేళ్ళ క్రితం బల్విందర్ సింగ్ అనే వ్యక్తికి చెందిన కెమికల్ లెబోరేటరీస్‌పై తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో 35 రకాల నిషేధిత మందులను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత లోబోరేటరీకి సీల్ వేసి.. కెమిస్ట్ డ్రగ్స్ లైసెన్స్‌ను రద్దు చేసింది.
 
దీంతో బల్వీందర్ సింగ్ ప్రతికారంతో రగిలిపోయాడు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం కాల్పులకు తెగబడ్డాడు. ఉదయం 10.30 గంటలకు నేహా కార్యాలయానికి బైక్‌పై వచ్చిన బల్వీందర్ సింగ్... నేరుగా నేహా ఉన్న గదిలోకి వెళ్లి రెండు బుల్లెట్లను కాల్చాడు. అవి నేహా తలలో, చాతీలో దూసుకెళ్లాయి. దీంతో ఆమె అక్కడే కుప్పకూలిపోయారు. 
 
ఆ తర్వాత బల్విందర్ 'హ్యప్పీ హోలీ' అంటూ నినాదాలు చేస్తూ అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. గేటు వద్ద సిబ్బంది అడ్డుకోవడంతో తన వద్దనున్న రివాల్వర్‌తో ఛాతీ, తల భాగాల్లో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటనపై విచారణ జరపాలని రాష్ట్ర డీజీపీకి పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ఆదేశించారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments