Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యను వదిలించుకోవాలనుకున్నాడు.. కాలువలో కొట్టుకుపోయాడు..

భార్యను వదిలించుకోవాలనుకున్నాడు. కానీ సీన్ రివర్సైంది. చివరకు అతనే బలైపోయిన ఘటన పంజాబ్‌లోని ఫిరోజ్ పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, అన్వర్ మసీహ్ (29), కోమల్ (26) వివాహం 2010లో జరిగింది

Webdunia
శనివారం, 30 డిశెంబరు 2017 (08:34 IST)
భార్యను వదిలించుకోవాలనుకున్నాడు. కానీ సీన్ రివర్సైంది. చివరకు అతనే బలైపోయిన ఘటన పంజాబ్‌లోని ఫిరోజ్ పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, అన్వర్ మసీహ్ (29), కోమల్ (26) వివాహం 2010లో జరిగింది.

గత కొన్ని రోజుల నుంచి వీరిద్దరి మధ్య ఏర్పడిన గొడవలు.. వారిని దూరం చేశాయి. అంతే భార్యను చంపాలని అన్వర్ నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం పక్కా ప్లాన్ వేశాడు. 
 
తన తమ్ముడు నాచ్ తార్‌తో కలిసి బుధవారం సాయంత్రం గ్రామానికి సమీపంలో వున్న కాలువ వద్దకు చేరాడు. ఆ తర్వాత వారిద్దరూ కోమల్‌ను ఆ ప్రాంతానికి రప్పించి కాలువలోకి తోసేశారు. కానీ ఆమె అప్రమత్తం కావడంతో కాలువలో పడకుండా ఒడ్డున వున్న చెట్టును పట్టుకుంది. 
 
ఇంతలో ఆమెను నీటిలోకి లాగేందుకు అన్వర్ నీటిలోకి దిగాడు. అంతే సీన్ రివర్సైంది. ప్రమాదవశాత్తు అన్వర్ నీటిలో కొట్టుకుపోయాడు. అది చూసిన తమ్ముడు భయంతో అక్కడి నుంచి పారిపోయాడు. కోమల్ అరుపులు విన్న స్థానికులు అక్కడకు చేరుకుని, ఆమెను కాపాడారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments