Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యను వదిలించుకోవాలనుకున్నాడు.. కాలువలో కొట్టుకుపోయాడు..

భార్యను వదిలించుకోవాలనుకున్నాడు. కానీ సీన్ రివర్సైంది. చివరకు అతనే బలైపోయిన ఘటన పంజాబ్‌లోని ఫిరోజ్ పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, అన్వర్ మసీహ్ (29), కోమల్ (26) వివాహం 2010లో జరిగింది

Webdunia
శనివారం, 30 డిశెంబరు 2017 (08:34 IST)
భార్యను వదిలించుకోవాలనుకున్నాడు. కానీ సీన్ రివర్సైంది. చివరకు అతనే బలైపోయిన ఘటన పంజాబ్‌లోని ఫిరోజ్ పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, అన్వర్ మసీహ్ (29), కోమల్ (26) వివాహం 2010లో జరిగింది.

గత కొన్ని రోజుల నుంచి వీరిద్దరి మధ్య ఏర్పడిన గొడవలు.. వారిని దూరం చేశాయి. అంతే భార్యను చంపాలని అన్వర్ నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం పక్కా ప్లాన్ వేశాడు. 
 
తన తమ్ముడు నాచ్ తార్‌తో కలిసి బుధవారం సాయంత్రం గ్రామానికి సమీపంలో వున్న కాలువ వద్దకు చేరాడు. ఆ తర్వాత వారిద్దరూ కోమల్‌ను ఆ ప్రాంతానికి రప్పించి కాలువలోకి తోసేశారు. కానీ ఆమె అప్రమత్తం కావడంతో కాలువలో పడకుండా ఒడ్డున వున్న చెట్టును పట్టుకుంది. 
 
ఇంతలో ఆమెను నీటిలోకి లాగేందుకు అన్వర్ నీటిలోకి దిగాడు. అంతే సీన్ రివర్సైంది. ప్రమాదవశాత్తు అన్వర్ నీటిలో కొట్టుకుపోయాడు. అది చూసిన తమ్ముడు భయంతో అక్కడి నుంచి పారిపోయాడు. కోమల్ అరుపులు విన్న స్థానికులు అక్కడకు చేరుకుని, ఆమెను కాపాడారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments