Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్రగ్స్ స్మగ్లింగ్.. మనీ లాండరింగే కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్టు

Webdunia
గురువారం, 28 సెప్టెంబరు 2023 (16:40 IST)
పంజాబ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే సుక్పాల్ ఖైరా సింగ్‌‍ను పోలీసులు అరెస్టు చేశారు. డ్రగ్స్ స్మగ్లింగ్, మనీ లాండరింగ్ కేసులో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారం ఇపుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. గత 2015లో నమోదైన కేసు ఆధారంగా గురువారం ఉదయం ఆయన నివాసంలో సోదాలు చేసిన పోలీసులు.. ఆ తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యే సుక్పాల్ సింగ్‌ను అరెస్టు చేస్తున్నట్టు ప్రకటించారు., 
 
ఈయనపై పోలీసులు పలు అభియోగాలు మోపుతున్నారు. డ్రగ్స్ స్మగ్లింగ్, మనీ లాండరింగ్, అంతర్జాతీయ స్మగ్లర్ల ముఠాగా అండదండలు అందించడం, వారికి ఆవాసం కల్పించడం, వారి నుంచి ఆర్థిక లబ్ధి పొందడం వంటి అనేక ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా స్మగ్లర్ల నుంచి తీసుకున్న డబ్బుతో ఆయన విలువైన ఆస్తులను కొనుగోలు చేశారని విచారణ సంస్థ అభియోగాలు మోపింది. 
 
గత 2014 నుంచి 2020 మధ్య కాలంలో సుక్పాల్ సింగ్ తన కోసం, తన కుటుంబం కోసం రూ.6.5 కోట్లకు పైగా ఖర్చు చేశారని, ఈ మొత్తం డిక్లరేషన్‌లో ఆయన పేర్కొన్న దాని కంటే ఎక్కువని పోలీసులు చెపుతున్నారు. మరోవైపు పోలీసులు తన ఇంటికి వచ్చి సోదాలు నిర్వహిస్తుండటాన్ని ఆయన ఫేస్‌బుక్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్ చేశారు. ఈ వీడియోలో ఆయన పోలీసులతో వాగ్వాదం చేస్తున్నట్టు ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

తర్వాతి కథనం
Show comments