Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీవీ చూడొద్దని తల్లి మందలించింది.. అంతే బాలుడు ఆత్మహత్య.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 10 జూన్ 2020 (16:42 IST)
watching TV
పాఠశాలలు సెలవులు, లాక్ డౌన్ కారణంగా పిల్లలు ఇంటి పట్టునే వుంటున్నారు. అయితే టీవీలకే అతుక్కుపోతున్నారు. అలా గంటల తరబడి టీవీ చూస్తున్నందుకు తల్లి మందలించిందనే కారణంతో ఆ బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని పూణెలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. 14 ఏళ్ల బాలుడు రోజూ గంటల తరబడి టీవీలో కార్టూన్లు చూస్తున్నాడు. 
 
ఈ విషయంలో తల్లి ఎన్నిసార్లు మందలించినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. మంగళవారం టీవీ చూస్తున్న బాలుడిని కాస్త గట్టిగానే మందలించిన తల్లి...టీవీని ఆఫ్ చేసింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాలుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబీకులు బాలుడిని స్థానిక ఆస్పత్రికి తరలించినా...అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. 
 
దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. అతని కుటుంబ సభ్యులను విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. క్షణికావేశంతో బాలుడి ఆత్మహత్యకు పాల్పడ్డాడని వారు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments