Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీవీ చూడొద్దని తల్లి మందలించింది.. అంతే బాలుడు ఆత్మహత్య.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 10 జూన్ 2020 (16:42 IST)
watching TV
పాఠశాలలు సెలవులు, లాక్ డౌన్ కారణంగా పిల్లలు ఇంటి పట్టునే వుంటున్నారు. అయితే టీవీలకే అతుక్కుపోతున్నారు. అలా గంటల తరబడి టీవీ చూస్తున్నందుకు తల్లి మందలించిందనే కారణంతో ఆ బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని పూణెలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. 14 ఏళ్ల బాలుడు రోజూ గంటల తరబడి టీవీలో కార్టూన్లు చూస్తున్నాడు. 
 
ఈ విషయంలో తల్లి ఎన్నిసార్లు మందలించినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. మంగళవారం టీవీ చూస్తున్న బాలుడిని కాస్త గట్టిగానే మందలించిన తల్లి...టీవీని ఆఫ్ చేసింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాలుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబీకులు బాలుడిని స్థానిక ఆస్పత్రికి తరలించినా...అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. 
 
దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. అతని కుటుంబ సభ్యులను విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. క్షణికావేశంతో బాలుడి ఆత్మహత్యకు పాల్పడ్డాడని వారు చెప్పారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments