Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లికి నిరాకరించిన సహజీవన ప్రియురాలు.. ప్రియుడు ఏం చేశాండంటే...

Webdunia
గురువారం, 6 డిశెంబరు 2018 (10:59 IST)
కొన్ని నెలల పాటు అతని ఆమె సహజీవనం చేసింది. ఇద్దరూ ఒకే ఇంట్లో కలిసివుండి ముద్దూ ముచ్చట తీర్చుకున్నారు. దీంతో ఆమెపై అతనికి ప్రేమ మరింత ముదిరిపోయింది. ఫలితంగా ఆమెను పెళ్లి చేసుకోవాలని భావించి, ఆమెకు చెప్పాడు. అందుకు ఆమె నిర్మొహమాటంగా నో చెప్పింది. దీంతో ఆ ప్రియుడుకి ఏం చేయోలా అర్థంకాక పోస్టర్లు ముద్రించి ఊరంతా అంటించాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని పూణెలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, పూణెకు చెందిన ఓ యువకుడు, ఓ యువతి కలిసి ఒకే ఇంట్లో సహజీవనం చేశారు. ఈ క్రమంలో ఆ యువతిపై యువకుడు గాఢమైన ప్రేమను పెంచుకున్నాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలని భావించాడు. ఈ విషయాన్ని ఆమెకు చెప్పగా నిర్ద్వద్వంగా తోసిపుచ్చింది. 
 
దీంతో దిక్కుతోచని అతను పోస్టర్లు ముద్రించి ఊరంతా అంటించాడు. దీనిపై స్పందిస్తూ, నిజానికి తొలుత తామిద్దరం పెళ్ళి చేసుకోవాలని భావించే సహజీవనం చేశామన్నారు. కానీ, ఆమెకు డబ్బులు కావాలని, అందుకే ఆమె తనను విడిచిపెట్టి వేరొకరిని పెళ్లి చేసుకోవాలనుకుంటోందని వాపోయాడు. 
 
ఆ యువకుడు ఈ విషయమై రచ్చ చేయడంతో ఆ యువతితో పాటు కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. పట్టణంలోని గోడలు, స్తంభాలపై పోస్టర్లు అతికించిన ఉదంతం తెలుసుకున్న పోలీసులు వాటిని తొలగించారు. అలాగే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments