Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయ చనిపోయినా వదలని కర్ణాటక సర్కార్.. రూ.100కోట్లు రావాల్సిందేనని?

దివంగత ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసులో నిందితురాలిగా ఉన్న అమ్మ నెచ్చెలి వీకే. శశికళ నటరాజన్‌ ప్రస్తుతం జైలులో శిక్ష అనుభవిస్తోంది. ఈమెతో పాటు జయలలిత అక్రమాస్తుల కేసులో ఇళవరశి, వి.ఎన్‌.సుధాకరన్‌‌

Webdunia
బుధవారం, 22 మార్చి 2017 (17:11 IST)
దివంగత ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసులో నిందితురాలిగా ఉన్న అమ్మ నెచ్చెలి వీకే. శశికళ నటరాజన్‌ ప్రస్తుతం జైలులో శిక్ష అనుభవిస్తోంది. ఈమెతో పాటు జయలలిత అక్రమాస్తుల కేసులో ఇళవరశి, వి.ఎన్‌.సుధాకరన్‌‌లను కూడా దోషులుగా సుప్రీం కోర్టు తేల్చింది. ఇక జయలలిత మరణించడంతో ఈ కేసు నుంచి ఆమెకు విముక్తి లభించింది. జయలలిత 2016 డిసెంబర్‌ 5వ తేదీన మరణించారు. 
 
అయితే జయలలిత మరణించినా ఈ కేసు విషయంలో కర్ణాటక వెనక్కి తగ్గేలా కనిపించట్లేదు. జయలలిత అక్రమాస్తుల కేసులో జరిమానా నుంచి తమకు రావాల్సిన రూ. 100 కోట్ల కోసం సుప్రీంకోర్టును కర్ణాటక సర్కారు ఆశ్రయించింది. జయ మరణించడం వల్ల ఆమె శిక్ష అనుభవించే పరిస్థితి లేనప్పటికీ, ఆమెకు విధించిన జరిమానాను మాత్రం తప్పనిసరిగా వసూలు చేయాల్సిందేనని కర్ణాటక ప్రభుత్వం సుప్రీం కోర్టును కోరింది. 
 
కాగా ఈ కేసుకు సంబంధించి విధించిన మొత్తం జరిమానాలో జయలలిత వాటా రూ. 100 కోట్లు. ఈ మొత్తం కర్ణాటక ప్రభుత్వానికి రావాల్సింది. కానీ జయ మరణించడంతో ఆమెపై విధించిన జరిమానాను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఈ నేపథ్యంలో జయలలిత ఎస్టేట్ నుంచి రూ.100 కోట్ల జరిమానాను కట్టాలని కర్ణాటక సీనియర్ న్యాయవాది డిమాండ్ చేస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments